భారత్-పాక్ మధ్య ఉద్రిక్త పరిస్థితులను ఐక్యరాజసమితి నిశితంగా గమనిస్తోంది
- September 30, 2016
'ఉరీ ఉగ్రదాడి' అనంతరం భారత్-పాక్ మధ్య నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులను ఐక్యరాజసమితి మిలటరీ విభాగం నిశితంగా గమనిస్తోంది. భారత్ జరిపిన లక్షిత దాడుల నేపథ్యంలో భారత్-పాక్ నియంత్రణ రేఖ వెంబడి పరిస్థితులపై ఐరాస ప్రధాన కార్యదర్శి బాన్కీమూన్ దృష్టి సారించినట్లు ఐరాస అధికార ప్రతినిధి స్టీఫెన్ డుజరిక్ తెలిపారు. భారత్-పాక్ పరిస్థితులపై ఐరాసలో ఉన్న మిలటరీ అబ్జర్వర్ గ్రూప్ (యూఎన్ఎంవోజీఐపీ) ప్రస్తుత పరిస్థితులపై నివేదిక తెప్పించుకుంటోందని ఆయన చెప్పారు. సరిహద్దులో ఉన్న పరిస్థితుల దృష్ట్యా ఇరు దేశాలు సమస్యను శాంతియుత వాతావరణంలో చర్చల ద్వారా పరిష్కరించుకోవాలని డుజరిక్ సూచించారు.దీనిపై రెండు ప్రభుత్వాలు పరస్పరం ఒక అవగాహనకు రావాలని కోరారు.
1949 జనవరి 24న యూఎన్ఎంవోజీఐపీ ఏర్పడింది. భారత్-పాక్ మధ్య సరిహద్దు వెంబడి పరిస్థితులను ఎప్పటికప్పుడు తెలుసుకుని తద్వారా పరిష్కారానికి చర్యలు తీసుకుంటుంది. ప్రస్తుతం దీనిలో స్వీడన్కు చెందిన మేజర్ జనరల్ పెర్ గుస్తాఫ్ లోదిన్ ఆధ్వర్యంలో 10 దేశాలకు చెందిన 41 మంది అబ్జర్వర్లు ఉన్నారు.
తాజా వార్తలు
- ధోఫార్ ఖరీఫ్ సీజన్.. వినియోగదారుల రక్షణకు 52 మంది అధికారుల నియామకం..!!
- కలర్వర్స్ ఎక్స్పీరియన్స్తో కుటుంబాలకు వినూత్న వినోదం..!!
- జెడ్డాలో భారీగా పట్టుబడ్డ నకిలీ బ్రాండెడ్ దుస్తులు..!!
- కొత్త మల్టిపుల్ ఎంట్రీ వీసాను ప్రవేశపెట్టిన సౌదీ..!!
- కువైట్ ఎయిర్ పోర్టులో 8.5 కిలోలకుపైగా హషీష్ స్వాధీనం..!!
- భారత్లో బాధ్యతలు చేపట్టిన కొత్త యూఏఈ రాయబారి..క్రెడెన్షియల్స్ సమర్పణ..!!
- పిల్లల ఆన్లైన్ భద్రతపై తల్లిదండ్రులకు బహ్రెయిన్ MOI సూచనలు..!!
- పోలీసుల సంక్షేమమే ప్రథమ ప్రాధాన్యం: డీజీపీ సీవీ ఆనంద్
- తెలంగాణ రాష్ట్రంలో కొత్తగా రెండు ఎయిర్పోర్ట్ లు..
- నిరసనకారుల రాళ్ల దాడిలో 118 మంది పోలీసులకు గాయాలు







