'మజ్ను' విజయోత్సవ యాత్ర

- September 30, 2016 , by Maagulf
'మజ్ను' విజయోత్సవ యాత్ర

విశాఖ నగరంలో 'మజ్ను' చిత్ర యూనిట్‌ సందడి చేసింది. నాని కథానాయకుడిగా తెరకెక్కి ఇటీవలే ప్రేక్షకుల ముందుకొచ్చిన 'మజ్ను' హిట్‌టాక్‌తో దూసుకుపోతోంది. దీంతో ఉత్సాహంగా ఉన్న చిత్ర బృందం విశాఖ నుంచి విజయోత్సవ యాత్ర ప్రారంభించింది. ఈ సందర్భంగా నాని మాట్లాడుతూ.. 'మజ్ను' చిత్రాన్ని విజయవంతం చేసిన ప్రేక్షకులకు ధన్యవాదాలు తెలిపారు. విశాఖ తనకు సెంటిమెంట్‌ ప్రదేశమని.. తన అన్ని చిత్రాల విజయోత్సవ యాత్రలను ఇక్కడి నుంచే ప్రారంభిస్తున్నట్లు చెప్పారు. ఈ యాత్ర విశాఖలో ప్రారంభమై రాజమహేంద్రవరం, ఏలూరు, విజయవాడ మీదుగా హైదరాబాద్‌ చేరుకుంటుందని తెలిపారు.

ఈ ఏడాది 'కృష్ణగాడి వీర ప్రేమగాథ' 'జెంటిల్‌మెన్‌' చిత్రాల ద్వారా విజయాలను అందుకున్న నాని 'మజ్ను'తో హ్యాట్రిక్‌ కొట్టాడు. 'ఉయ్యాల జంపాల' లాంటి స్వచ్ఛమైన పల్లెటూరి ప్రేమకథను తెరకెక్కించిన విరంచి వర్మ ఈ చిత్రానికి దర్శకుడు. నాని సరసన ఇమ్మాన్యుయేల్‌, ప్రియాశ్రీ హీరోయిన్లుగా నటించారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com