'మజ్ను' విజయోత్సవ యాత్ర
- September 30, 2016
విశాఖ నగరంలో 'మజ్ను' చిత్ర యూనిట్ సందడి చేసింది. నాని కథానాయకుడిగా తెరకెక్కి ఇటీవలే ప్రేక్షకుల ముందుకొచ్చిన 'మజ్ను' హిట్టాక్తో దూసుకుపోతోంది. దీంతో ఉత్సాహంగా ఉన్న చిత్ర బృందం విశాఖ నుంచి విజయోత్సవ యాత్ర ప్రారంభించింది. ఈ సందర్భంగా నాని మాట్లాడుతూ.. 'మజ్ను' చిత్రాన్ని విజయవంతం చేసిన ప్రేక్షకులకు ధన్యవాదాలు తెలిపారు. విశాఖ తనకు సెంటిమెంట్ ప్రదేశమని.. తన అన్ని చిత్రాల విజయోత్సవ యాత్రలను ఇక్కడి నుంచే ప్రారంభిస్తున్నట్లు చెప్పారు. ఈ యాత్ర విశాఖలో ప్రారంభమై రాజమహేంద్రవరం, ఏలూరు, విజయవాడ మీదుగా హైదరాబాద్ చేరుకుంటుందని తెలిపారు.
ఈ ఏడాది 'కృష్ణగాడి వీర ప్రేమగాథ' 'జెంటిల్మెన్' చిత్రాల ద్వారా విజయాలను అందుకున్న నాని 'మజ్ను'తో హ్యాట్రిక్ కొట్టాడు. 'ఉయ్యాల జంపాల' లాంటి స్వచ్ఛమైన పల్లెటూరి ప్రేమకథను తెరకెక్కించిన విరంచి వర్మ ఈ చిత్రానికి దర్శకుడు. నాని సరసన ఇమ్మాన్యుయేల్, ప్రియాశ్రీ హీరోయిన్లుగా నటించారు.
తాజా వార్తలు
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!







