యు.ఏ.ఈ. ద్రవ్య బదలాయింపులో సగానికి పైగా భారత్ కు!

- August 13, 2015 , by Maagulf
యు.ఏ.ఈ. ద్రవ్య బదలాయింపులో సగానికి పైగా భారత్ కు!

ప్రపంచవ్యాప్తంగా వివిధ దేశాలలో నివశిస్తున్న భారతీయుల సంఖ్య 28 మిలియన్లు ఉండగా, 2014 సంవత్సర ద్రవ్య బదలాయింపులలో చైనాను వెనక్కు నెట్టి, భారత్ 70.39 బిలియన్ డాలర్లతో ప్రధమ స్థానంలో ఉంది. ప్రపంచ బాంకు అంచనాల ప్రకారం, 2014లో ఆరు జీసీసీ దేశాలు, 102 బిలియన్ డాలర్లను బదిలీ చేయగా, అందులో ఎక్కువ మొత్తం ఇండియా, బంగ్లాదేశ్, ఫిలిప్పైన్స్, పాకిస్తాన్, శ్రీ లంక, నేపాల్ వంటి ఏషియా దేశాలు సింహభాగం ఆక్రమించాయని, 200 పైగా వివిధ దేశాల వారు ఉంటున్న యూ. ఏ. ఈ. లో 2.65 భారతీయ వాసులు ఉండగా, భారత్ కు బదిలీ అయిన మొత్తం ఎగుమతుల ఆదాయం, FDI మరియు విదేశీసంస్థల పెట్టుబడులు కాకుండా, 12 బిలియన్ల నుండి 15 బిలియలకు పెరిగిందనీ, యూ. ఏ. ఈ. ఎక్శ్ఛేంజ్ అద్యక్షులు శ్రీ సుధీర్ కుమార్ శెట్టి తెలియజేశారు. ఇక సౌదీలో కూడా 28 మిలియన్ల శ్రామికులుండగా, వారు పంపిణీ చేసిన మొత్తం 10.836 బిలియన్ డాలర్లతో భారత్  అగ్రస్థానంలో ఉంది.


 --సి.శ్రీ(దుబాయ్)

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com