2018 కల్లా సిద్ధం కానున్న GCC రైల్ నెట్వర్క్
- August 13, 2015
నిర్దేశిత గడువు కంటే 3 సంవత్సరాల ముందుగానే అంటే 2018 కల్లా GCC రైల్ నెట్వర్క్ పని పూర్తి కానుంది. GCC సెక్ర టేరియల్ జనరల్ వారు వెల్లడించిన ఈ పధకం అభివృద్ధి వివరాల ప్రకారo, గంటకు అత్యధికంగా 220 కి. మీ. వేగంతో వెళ్ళగలిగే ఈ రైలు డీజిల్ తో నడుస్తుందని, కువేట్ నుండి ఒమాన్ వరకు మొత్తం 6 గల్ఫ్ రాజ్యాలగుండా పోయే 2117 కి. మీ. పొడవుగల అత్యాధునిక కమ్యూనికేషన్ టెక్నాలజీ, ఆపరేటింగ్ సిస్టం లు గల ఈ రైలు ప్రోజక్టు విలువ 200 బిలియన్ కోట్లనీ తెలిపారు. బహ్రైన్ మరియు సౌదీ అరేబియాలను కలిపే రైల్వే లింకుతో పాటు, కింగ్ హమాద్ కాజ్ వేను, బహ్రైన్ మరియు కతార్ల మధ్య కాజ్ వేతో కలుపబడే ఈ రైలు మార్గం, కువేట్ వద్ద మొదలై మస్కట్ వరకు కొనసాగుతుందని తెలిపారు. ఇంకా, బహ్రైన్లోనున్న ఈ రైలు మార్గాలు అన్ని అనుమతులు పొందాయని కూడా వెల్లడించారు. ఇది ఖలీఫా బిన్ సల్మాన్ పోర్ట్, బహ్రైన్ ఇంటర్నేషనల్ ఏర్ పోర్టులతో పాటు కతార్ వద్ద నిర్మింపబడనున్న కాజ్ వే తో దేశంతర లింకులను కలిగి ఉంటుందని ఆయన వివరించారు.
--యం.వాసుదేవ రావు(మాగల్ఫ్ ప్రతినిధి,బహ్రెయిన్)
తాజా వార్తలు
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!







