పాఠశాల బస్సు ప్రమాదంలో గాయపడిన 38 మంది ఆసుపత్రి నుంచి విడుదల
- September 30, 2016
అబూధాబీ : గత గురువారం ఉదయం అబూధాబీ లో ఒక ప్రధాన రోడ్డులో మూడు బస్సుల ప్రమాదంలో గాయపడిన 38 మంది విద్యార్థులు, 9 మంది ఇతరులు చికిత్స అనంతరం మఫ్రాక్ ఆసుపత్రి నుంచి విడుదల కాబడినట్లు అబూధాబీ హెల్త్ సర్వీసెస్ కంపెనీ (సెహ ) ప్రకటించింది.రెండు పాఠశాల బస్సులు మరియు ఒక పబ్లిక్ రవాణా బస్సు అబూధాబీ లో ముస్సాఫ్ఫాహ్ వంతెన తర్వాత.ఖలీజ్ అల్ ముస్లిం విద్యా కేంద్రం అరబీ రోడ్డుపై "ఢీ" కొన్నప్పుడు నలభై ఏడు మందిలో అత్యధికమంది పిల్లలు గాయపడ్డారు. ఈ ప్రమాదంలో గాయపడిన పలువురిని మెరుగైన చికిత్స కోసం మఫ్రాక్ హాస్పిటల్ మరియు షేక్ ఖలీఫా మెడికల్ సిటీ ఆసుపత్రులకు తరలించి వైద్యసేవలు అందించినట్లు ఎమర్జెన్సీకి సంసిద్ధత డైరెక్టర్ డాక్టర్ మార్వాన్ అల్ కాబి తెలిపారు. ఇరవై ఐదు మందికి స్వల్ప గాయాలు కాగా, మరో 20 మందికి మోస్తరు గాయాలయ్యాయని మరియు ఇద్దరికి తీవ్రమైన గాయాలయ్యాయని మఫ్రాక్ హాస్పిటల్ సిఇఓ మహ్మద్ అబ్దుల్లా అల్ దహెరి చెప్పారు. గాయపడిన తొమ్మిది మందిలో ఏడుగురికి స్వల్పంగా ఎముకలు విరగ్గా ఆసుపత్రిలో వైద్యం చేయించుకున్నారు. మరో ఇరువురిని ఇంటెన్సివ్ కేర్ లో ఇప్పుడు ఉంటూనే దవడ మరియు తొడ గాయాలకు శస్త్రచికిత్సలు జరిగేయి. తమ వైద్య సిబ్బంది ఈ కేసులను అత్యంత వృత్తి నైపుణ్యంతో అత్యవసర పద్ధతిలో నిర్వహించారని ఆయన పేర్కొన్నారు.
తాజా వార్తలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!
- వాణిజ్య స్థలాల అద్దెపై కువైట్ ఫైర్ ఫోర్స్ కీలక సూచనలు..!!
- పర్యావరణ పరిరక్షణలో ఒమన్కు అంతర్జాతీయ గుర్తింపు..!!







