పాఠశాల బస్సు ప్రమాదంలో గాయపడిన 38 మంది ఆసుపత్రి నుంచి విడుదల

- September 30, 2016 , by Maagulf
పాఠశాల బస్సు ప్రమాదంలో గాయపడిన  38 మంది  ఆసుపత్రి నుంచి విడుదల

అబూధాబీ : గత గురువారం ఉదయం అబూధాబీ లో ఒక ప్రధాన రోడ్డులో మూడు బస్సుల ప్రమాదంలో గాయపడిన 38 మంది విద్యార్థులు, 9 మంది ఇతరులు  చికిత్స అనంతరం  మఫ్రాక్  ఆసుపత్రి నుంచి విడుదల కాబడినట్లు  అబూధాబీ హెల్త్ సర్వీసెస్ కంపెనీ (సెహ ) ప్రకటించింది.రెండు పాఠశాల బస్సులు మరియు ఒక పబ్లిక్ రవాణా బస్సు అబూధాబీ లో ముస్సాఫ్ఫాహ్  వంతెన తర్వాత.ఖలీజ్  అల్ ముస్లిం విద్యా కేంద్రం అరబీ రోడ్డుపై "ఢీ" కొన్నప్పుడు నలభై ఏడు మందిలో అత్యధికమంది పిల్లలు గాయపడ్డారు. ఈ ప్రమాదంలో గాయపడిన పలువురిని మెరుగైన చికిత్స కోసం మఫ్రాక్  హాస్పిటల్ మరియు షేక్ ఖలీఫా మెడికల్ సిటీ ఆసుపత్రులకు తరలించి వైద్యసేవలు అందించినట్లు  ఎమర్జెన్సీకి సంసిద్ధత డైరెక్టర్ డాక్టర్ మార్వాన్ అల్ కాబి తెలిపారు. ఇరవై ఐదు మందికి  స్వల్ప గాయాలు కాగా, మరో 20 మందికి  మోస్తరు గాయాలయ్యాయని మరియు ఇద్దరికి తీవ్రమైన గాయాలయ్యాయని మఫ్రాక్  హాస్పిటల్ సిఇఓ మహ్మద్ అబ్దుల్లా అల్ దహెరి చెప్పారు. గాయపడిన తొమ్మిది మందిలో ఏడుగురికి స్వల్పంగా ఎముకలు విరగ్గా ఆసుపత్రిలో వైద్యం చేయించుకున్నారు. మరో ఇరువురిని ఇంటెన్సివ్ కేర్ లో ఇప్పుడు ఉంటూనే దవడ మరియు తొడ గాయాలకు  శస్త్రచికిత్సలు జరిగేయి. తమ వైద్య సిబ్బంది ఈ కేసులను అత్యంత వృత్తి నైపుణ్యంతో అత్యవసర పద్ధతిలో  నిర్వహించారని ఆయన పేర్కొన్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com