పాఠశాల బస్సు ప్రమాదంలో గాయపడిన 38 మంది ఆసుపత్రి నుంచి విడుదల
- September 30, 2016
అబూధాబీ : గత గురువారం ఉదయం అబూధాబీ లో ఒక ప్రధాన రోడ్డులో మూడు బస్సుల ప్రమాదంలో గాయపడిన 38 మంది విద్యార్థులు, 9 మంది ఇతరులు చికిత్స అనంతరం మఫ్రాక్ ఆసుపత్రి నుంచి విడుదల కాబడినట్లు అబూధాబీ హెల్త్ సర్వీసెస్ కంపెనీ (సెహ ) ప్రకటించింది.రెండు పాఠశాల బస్సులు మరియు ఒక పబ్లిక్ రవాణా బస్సు అబూధాబీ లో ముస్సాఫ్ఫాహ్ వంతెన తర్వాత.ఖలీజ్ అల్ ముస్లిం విద్యా కేంద్రం అరబీ రోడ్డుపై "ఢీ" కొన్నప్పుడు నలభై ఏడు మందిలో అత్యధికమంది పిల్లలు గాయపడ్డారు. ఈ ప్రమాదంలో గాయపడిన పలువురిని మెరుగైన చికిత్స కోసం మఫ్రాక్ హాస్పిటల్ మరియు షేక్ ఖలీఫా మెడికల్ సిటీ ఆసుపత్రులకు తరలించి వైద్యసేవలు అందించినట్లు ఎమర్జెన్సీకి సంసిద్ధత డైరెక్టర్ డాక్టర్ మార్వాన్ అల్ కాబి తెలిపారు. ఇరవై ఐదు మందికి స్వల్ప గాయాలు కాగా, మరో 20 మందికి మోస్తరు గాయాలయ్యాయని మరియు ఇద్దరికి తీవ్రమైన గాయాలయ్యాయని మఫ్రాక్ హాస్పిటల్ సిఇఓ మహ్మద్ అబ్దుల్లా అల్ దహెరి చెప్పారు. గాయపడిన తొమ్మిది మందిలో ఏడుగురికి స్వల్పంగా ఎముకలు విరగ్గా ఆసుపత్రిలో వైద్యం చేయించుకున్నారు. మరో ఇరువురిని ఇంటెన్సివ్ కేర్ లో ఇప్పుడు ఉంటూనే దవడ మరియు తొడ గాయాలకు శస్త్రచికిత్సలు జరిగేయి. తమ వైద్య సిబ్బంది ఈ కేసులను అత్యంత వృత్తి నైపుణ్యంతో అత్యవసర పద్ధతిలో నిర్వహించారని ఆయన పేర్కొన్నారు.
తాజా వార్తలు
- టీమిండియాదే విజయం..కివీస్తో ఫైనల్ పోరుకు రెడీ..
- ఖమేనీ మృతికి అధికారికంగా సంతాపం తెలిపిన భారత్
- ICC Mens T20 World Cup 2026: భారత్ భారీ స్కోర్..
- అమెరికా ట్యాంకర్ పై దాడి చేసిన ఇరాన్
- గల్ఫ్ దేశాలకు ఇటలీ బాసట
- షార్జా ఛారిటీ రికార్డు: మొదటి 15 రోజుల్లోనే 4.5 లక్షల ఇఫ్తార్ భోజనాల పంపిణీ!
- అబూదాబీ ICAD 2పై డ్రోన్ శకలాలు: ఆరుగురికి గాయాలు..
- Dh15 మిలియన్ జాక్పాట్ కొట్టిన షార్జా డ్రైవర్..!!
- పబ్లిక్ ప్లేసుల్లో అలాచేస్తే..OMR 300 ఫైన్, 3 నెలల జైలు..!!
- రిలీఫ్ ఫ్లైట్స్..ఖతార్ ఎయిర్వేస్ బిగ్ అప్డేట్..!!









