'యు' ధ్రువీకరణ పత్రం పొందిన 'దేవి'
- September 30, 2016
ప్రభుదేవా, తమన్నా జంటగా నటించిన చిత్రం 'దేవి'. 'మదరాసపట్టిణం', 'తలైవా' వంటి సినిమాలను రూపొందించిన విజయ్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. చిత్రీకరణ పూర్తయింది. శుక్రవారం ఈ సినిమా సెన్సార్కు వెళ్లొచ్చింది. దీనిని చూసిన అధికారులు 'యు' ధ్రువీకరణ పత్రం అందజేశారు. ఇదిలా ఉండగా థ్రిల్లర్ కథాంశంతో తెరకెక్కిన ఈ చిత్రాన్ని ఈ నెల ఏడో తేదీన విడుదల చేయనున్నట్లు ప్రకటించారు. కె.గణేశ్ నిర్మించిన ఈ సినిమాలో సోనూసూద్ ముఖ్యపాత్ర పోషించారు. తెలుగు, తమిళం, హిందీ భాషల్లో ఏకకాలంలో విడుదలవుతోంది. ఇదిలా ఉండగా శివకార్తికేయన్ నటించిన 'రెమో' సినిమా కూడా ఏడో తేదీన తెరపైకి రానుంది.అలాగే విజయ్సేతుపతి నటించిన 'రెక్క' చిత్రం కూడా అదే రోజున అదృష్టాన్ని పరీక్షించుకోబోతోంది.
తాజా వార్తలు
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!
- వాణిజ్య స్థలాల అద్దెపై కువైట్ ఫైర్ ఫోర్స్ కీలక సూచనలు..!!
- పర్యావరణ పరిరక్షణలో ఒమన్కు అంతర్జాతీయ గుర్తింపు..!!
- సోషల్ మీడియా బ్యాన్.. క్రియేటర్ ఎకానమీపై ప్రభావంపై యూఏఈ క్లారిటీ..!!
- డొమెస్టిక్ వర్కర్ ను వేధించిన మహిళకు మూడేళ్ల జైలు..!!
- ధోఫార్ ఖరీఫ్ సీజన్.. వినియోగదారుల రక్షణకు 52 మంది అధికారుల నియామకం..!!
- కలర్వర్స్ ఎక్స్పీరియన్స్తో కుటుంబాలకు వినూత్న వినోదం..!!
- జెడ్డాలో భారీగా పట్టుబడ్డ నకిలీ బ్రాండెడ్ దుస్తులు..!!
- కొత్త మల్టిపుల్ ఎంట్రీ వీసాను ప్రవేశపెట్టిన సౌదీ..!!







