బ్రెజిల్ జైలు నుంచి 200 మంది ఖైదీలు పరారీ..
- September 30, 2016
బ్రెజిల్లోని అతిపెద్ద నగర మైన సావో పౌలోలోని జైలు నుంచి 200 మంది ఖైదీలు పరారయ్యరు. ఈ ఘటన గురువారం చోటుచేసుకుంది. ఉదయం వేళల్లో హాజరుకు పిలిచినప్పుడు కొంత మంది ఖైదీలు జైలు గదులకు నిప్పుపెట్టారు. ఈ సంఘటనతో చెలరేగిన అలజడిలో 200 మంది ఖైదీలు జైలు నుంచి పారిపోయారు. 13 అడుగుల ఎత్తైన గోడను దూకి సమీపంలోని నదీతీరం వెంబడి అదేవిధంగా చెరకు పంట పొలాల నుండి ఖైదీలు పారిపోయారు. పారిపోయిన ఖైదీల్లో సగం మందిని పోలీసు అధికారులు గంటలు తిరగకుండానే పట్టుకున్నారు. మిగతావారి కోసం గాలింపు చర్యలను ముమ్మరం చేశారు. వెయ్యి మంది ఖైదీలు ఉండేట్టు ఈ జైలును నిర్మించారు. ప్రస్తుతం ఇందులో 1800 మంది ఖైదీలు ఉన్నట్టు సమాచారం.ఖైదీల హక్కులను కాలరాస్తున్నారని మానవ హక్కుల సంఘాలు ఎప్పటినుంచో ఆరోపిస్తున్నాయి. బ్రెజిల్లో జైలు నుంచి ఖైదీలు పారిపోవడం చాలా సాధారణంగా జరుగుతూ ఉంటుంది. కాగా ఖైదీల పరారీ సందర్భంగా ఎటువంటి నష్టం(గార్డ్స్ లేదా ఖైదీలు మరణించడం, గాయపడటం) జరిగింది. ఇప్పటికైతే తెలియరాలేదు.
తాజా వార్తలు
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!







