బ్రెజిల్ జైలు నుంచి 200 మంది ఖైదీలు పరారీ..
- September 30, 2016
బ్రెజిల్లోని అతిపెద్ద నగర మైన సావో పౌలోలోని జైలు నుంచి 200 మంది ఖైదీలు పరారయ్యరు. ఈ ఘటన గురువారం చోటుచేసుకుంది. ఉదయం వేళల్లో హాజరుకు పిలిచినప్పుడు కొంత మంది ఖైదీలు జైలు గదులకు నిప్పుపెట్టారు. ఈ సంఘటనతో చెలరేగిన అలజడిలో 200 మంది ఖైదీలు జైలు నుంచి పారిపోయారు. 13 అడుగుల ఎత్తైన గోడను దూకి సమీపంలోని నదీతీరం వెంబడి అదేవిధంగా చెరకు పంట పొలాల నుండి ఖైదీలు పారిపోయారు. పారిపోయిన ఖైదీల్లో సగం మందిని పోలీసు అధికారులు గంటలు తిరగకుండానే పట్టుకున్నారు. మిగతావారి కోసం గాలింపు చర్యలను ముమ్మరం చేశారు. వెయ్యి మంది ఖైదీలు ఉండేట్టు ఈ జైలును నిర్మించారు. ప్రస్తుతం ఇందులో 1800 మంది ఖైదీలు ఉన్నట్టు సమాచారం.ఖైదీల హక్కులను కాలరాస్తున్నారని మానవ హక్కుల సంఘాలు ఎప్పటినుంచో ఆరోపిస్తున్నాయి. బ్రెజిల్లో జైలు నుంచి ఖైదీలు పారిపోవడం చాలా సాధారణంగా జరుగుతూ ఉంటుంది. కాగా ఖైదీల పరారీ సందర్భంగా ఎటువంటి నష్టం(గార్డ్స్ లేదా ఖైదీలు మరణించడం, గాయపడటం) జరిగింది. ఇప్పటికైతే తెలియరాలేదు.
తాజా వార్తలు
- DXB, DWC లో 48 గంటల్లో 1,140 ఫ్లైట్స్..!!
- యూఏఈలో ప్రయాణికులకు ఉచిత వైద్య సహాయం..!!
- రియాద్కు భారీ వర్ష సూచన..!!
- ఇరాన్, GCC దేశాల నుండి ఒమానీ పౌరులు సేఫ్ రిటర్న్..!!
- ఇరాన్ క్షిపణులను అడ్డుకున్న కువైట్..!!
- బాప్కోలో అగ్నిప్రమాదం..ఇరాన్ మిస్సైల్ అటాక్?
- డిఫెన్స్ ఆపరేషన్ సెంటర్ ను సందర్శించిన డిప్యూటీ పీఎం..!!
- కర్ణాటక ప్రభుత్వం సంచలన నిర్ణయం..
- వాహనదారులకు ఊరట
- ఆస్కార్స్ 2026 ప్రజెంటర్గా ప్రియాంక చోప్రా









