కార్మికులే రన్-ఓవర్ ఘటనల్లో బాధితులు
- October 01, 2016
దోహా: ట్రాఫిక్ డిపార్ట్మెంట్ నివేదికల ప్రకారం రన్ ఓవర్ ఘటనల్లో ఎక్కువగా రాత్రి వేళల్లో, అందునా వింటర్ సీజన్లోనే జరుగుతున్నట్లు తేలింది. ఇండఇఃస్టయల్ ఏరియా, సల్వా రోడ్ ప్రాంతాల్లో ఈ ప్రమాదాలు ఎక్కువగా చోటు చేసుకుంటున్నాయి. ఇండస్ట్రియల్ ఏరియాలో కార్మికులు, సల్వా రోడ్లో షాపర్స్ రోడ్డు ప్రమాద బాధితులవుతున్నారు. తక్కువ ఆదాయం గల కార్మికులు రన్ ఓవర్ ఘటనల్లో ఎక్కువగా బాధిలవుతున్నట్లుగా గణాంకాలు చెబుతున్నాయి. గత ఏడాది 49 మంది పాదచారులు ప్రాణాలు కోల్పోగా, ఈ ఏడాది ఇప్పటిదాకా 37 మంది మృతి చెందారు. 70 శాతం మంది కార్మికులు ఇండస్ట్రియల్ ఏరియాలో నివసిస్తూ, అక్కడే పనిచేస్తుంటారనీ, వాహనదారుల నిర్లక్ష్యంతోపాటుగా కార్మికులు కూడా బాధ్యతారహితంగా రోడ్లపై నడుస్తుండడం వల్ల ప్రమాదాలు జరుగుతున్నాయని నివేదికలు వెల్లడిస్తున్నాయి. వాహనదారుల్లో అవగాహన పెంచడం, అలాగే పాదచారుల్లో అవగాహన పెంచడం వల్ల మాత్రమే వాహన ప్రమాదాల్ని నియంత్రించగలుగుతామని అధికారులు చెప్పారు. తగిన చర్యలు తీసుకుంటున్నప్పటికీ, నిర్లక్ష్యమే నిండు ప్రాణాల్ని బలిగొంటోందని అధికారులు ఆందోళన వ్యక్తం చేశారు. ప్రధానంగా పాదచారులు, వాహనదారులు రోడ్డుపై వెళుతున్న సమయంలో మొబైల్ ఫోన్లలో మాట్లాడుతుండడం ప్రమాదాలకు కారణమవుతున్నట్లు తేలింది.
తాజా వార్తలు
- ఒమన్లో జూలై 25 నుంచి 'పర్పుల్ శనివారం' ప్రారంభం..!!
- దుబాయ్లో 30 ఫుట్ ఓవర్ బ్రిడ్జీలపై స్మార్ట్ LED వ్యవస్థ..!!
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !







