అక్రమ యూటర్న్, ఓవర్టేకింగ్పై రాడార్ కన్ను
- October 01, 2016
దుబాయ్: దుబాయ్ రోడ్లు ఇకపై మరింత సేఫ్గా మారనున్నాయి. కొత్త రాడార్లను రహదార్లపై ఏర్పాటు చేసి, అక్రమంగా యూటర్న్ తీసుకునేవారినీ, నిబంధనలకు విరుద్ధంగా ఓవర్టేకింగ్ చేసేవారినీ ఓ పట్టు పట్టనున్నారు దుబాయ్ ట్రాఫిక్ పోలీసులు. మొత్తం 28 కొత్త రాడార్లను పలు ముఖ్యమైన రోడ్లపై ఏర్పాటు చేస్తున్నారు. ట్రాఫిక్ ఇంటర్సెక్షన్స్, సిగ్నల్స్ వద్ద వీటిద్వారా వాహనదారుల కదలికల్ని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తారు. దమాస్కస్ స్ట్రీట్, హలెబ్ స్ట్రీట్ మరికొన్ని ప్రాంతాల్లో ఈ కొత్త రాడార్లను ఇప్పటికే ఏర్పాటు చేశారు. యూరోప్లో ఈ తరహా రాడార్లు పనిచేస్తున్నాయనీ, అక్కడ ట్రాఫిక్ స్మూత్గా ఉంటుందని ట్రాఫిక్ జనరల్ డిపార్ట్మెంట్ డైరెక్టర్ కల్నల్ సైఫ్ ముహైర్ అల్ మజ్రోయి చెప్పారు. నిబంధనల ఉల్లంఘనను కొత్త రాడార్ గుర్తించగానే, ఆ విషయాన్ని కమాండ్ సెంటర్కి ఎస్ఎంఎస్ రూపంలో తెలియజేస్తుంది. వాహన వేగాన్ని గుర్తించడం, ఆ వాహన నెంబర్ ప్లేట్ని నమోదు చేయడం వంటివి ఈ కొత్త రాడార్లో ఇంకా సమర్థవంతంగా ఉంటాయని అధికారులు తెలిపారు. యెల్లో బ్లాక్ వయొలేషన్స్, డేంజరస్ ఓవర్టేకింగ్స్, యూ-టర్న్స్ వంటివాటినీ రాడార్ పర్యవేక్షిస్తుంది.
తాజా వార్తలు
- కువైట్లో భారీ డ్రగ్స్ వ్యతిరేక ఆపరేషన్.. ఎనిమిది మంది అరెస్ట్..!!
- ఆగస్టు నుంచి పీహెచ్సీసీ 'కేర్ సమ్మర్' కార్యక్రమం..!!
- ఇంధన రంగంలో సహకారంపై సౌదీ–భారత్ చర్చలు..!!
- సోషల్ మీడియాలో అభ్యంతరకర పోస్టులు.. వ్యక్తి అరెస్ట్..!!
- ఒమన్లో జూలై 25 నుంచి 'పర్పుల్ శనివారం' ప్రారంభం..!!
- దుబాయ్లో 30 ఫుట్ ఓవర్ బ్రిడ్జీలపై స్మార్ట్ LED వ్యవస్థ..!!
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..







