పిల్లలు తీసుకెళ్ళే పాఠశాల బస్సు డ్రైవర్లకు హెచ్చరిక

- October 01, 2016 , by Maagulf
పిల్లలు తీసుకెళ్ళే పాఠశాల బస్సు డ్రైవర్లకు హెచ్చరిక

జెడ్డా: పాఠశాల బస్సుల ద్వారా విద్యార్థులను తీసుకువెళుతున్న డ్రైవర్లు తగిన జాగ్రత్తలు పాటించాలని  ట్రాఫిక్ జనరల్ డైరెక్టరేట్ హెచ్చరించారు.అజాగ్రత్తగా వ్యవహరిస్తే, ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించినవారిపై నేరశాతం బట్టి  3,000 సౌదీ రియాళ్ళు నుంచి  6,000 సౌదీ రియాళ్ళు జరిమానాను రానున్న రోజుల్లో విధించవచ్చని డైరెక్టరేట్ చెప్పారు.

తారిఖ్ అల్ రుబాయెన్ ప్రతినిధి మాట్లాడుతూ పాఠశాల బస్సులలో విద్యార్థులు ప్రయాణిస్తున్నప్పుడు ముందు ప్రయాణిస్తున్న వాహనాలను దాటిపోవాలనే ఆదుర్దా , హడావుడిని సహించబోమని ఆయన తెలిపారు. నేషనల్ ఇన్ఫర్మేషన్ సెంటర్, ఇంటీరియర్ మంత్రిత్వ శాఖ, కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ మధ్య ఎలక్ట్రానిక్ మరియు వ్యవస్థ అనుసంధానం పూర్తయితే త్వరలో ట్రాఫిక్ ఉల్లంఘనలను అరికకట్టి సక్రమ ట్రాఫిక్ మీద  ప్రభావం చూపుతాయని ఆయన అన్నారు.పాఠశాల పిల్లల భద్రత మెరుగుపడేలా పలు  సంస్కరణలకి లోబడి  కాలిబాటలు మరియు ఇళ్ళు దగ్గరగా ఆపడానికి తగినట్లుగా డ్రైవర్లు జాగ్రత్తగా  వ్యవహరించాలని ఆయన అన్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com