పాక్ లో ఐదుగురు ఉగ్రవాదుల అరెస్ట్
- October 02, 2016
గత నెలలో మర్దాన్ జిల్లా కోర్టులో జరిగిన పేలుడులో ప్రమేయమున్నట్టు భావిస్తున్న ఐదుగురు ఉగ్రవాదులను పాకిస్థాన్ అరెస్ట్ చేసింది. ఈ విషయాన్ని పాక్ ప్రధాని కార్యాలయం ఆదివారం ప్రకటించింది. సెప్టెంబరు 2న జిల్లా కోర్టులో జరిగిన ఆత్మాహుతి దాడిలో 14 మంది మరణించారు. ఈ క్రమంలో ఉగ్రవాదుల కోసం వేట ప్రారంభించిన దళాలు తాాజాగా నాలుగు ఉగ్ర శిబిరాలను ధ్వంసం చేసి ఐదుగురు ఉగ్రవాదులను అదుపులోకి తీసుకున్నాయి. మదాన్ దాడిలో తమ ప్రమేయం ఉన్నట్టు వారు అంగీకరించారని ప్రధాని కార్యాలయం ఆ ప్రకటనలో పేర్కొంది. ఉగ్రవాదులను అదుపులోకి తీసుకున్న భద్రతా దళాలను నవాజ్ షరీఫ్ అభినందించారు.
తాజా వార్తలు
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!







