మంజు వారియర్ హీరోగా అరవింద్స్వామి
- October 02, 2016
1990లో తనకంటూ ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్న నటుడు అరవింద్స్వామి. అవకాశాలు తగ్గడంతో సినిమాలకు దూరమయ్యారు. చాలా గ్యాప్ తర్వాత ఆయన నటించిన 'తని ఒరువన్' మంచి గుర్తింపు తెచ్చింది. కెరీర్ పరంగా ఆయన రీ ఎంట్రీ ఇచ్చినట్లుగా మారింది. భిన్నమైన పాత్రలో ఇంటెలిజెంట్ విలన్గా నటించి మెప్పించారు. ఆయన శైలి నచ్చినందువల్లే ఈ సినిమా తెలుగు రీమేక్లో కూడా అరవింద్స్వామినే నటించాలని నటుడు రాంచరణ్ కూడా పట్టుబట్టినట్లు సమాచారం. ఇదిలా ఉండగా ప్రస్తుతం ఆయన 'బోగన్'లో మళ్లీ జయంరవితో కలసి నటిస్తున్నారు. తాజాగా 'చదురంగవేట్టె 2' సినిమాలో నటించేందుకు కూడా అంగీకరించారు.
ఇందులో ఆయనకు జంటగా త్రిష నటించడం విశేషం. ఈ నేపథ్యంలో మరో కొత్త సినిమాకు కూడా అరవింద్ సిద్ధమయ్యారు. విజయ్ హీరోగా 'తిరుమలై' సినిమాను రూపొందించిన రమణ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమాలో హీరోగా నటిస్తున్నారు. ఇందులో ప్రముఖ మలయాళ నటి మంజు వారియర్ హీరోయిన్గా నటిస్తున్నారు.
మంజు వారియర్ నటిస్తున్న తొలి తమిళ చిత్రం కూడా ఇదే కావడం విశేషం. యాక్షన్, థ్రిల్లర్ కథాంశంతో దీన్ని రూపొందిస్తున్నట్లు సమాచారం.
తాజా వార్తలు
- డ్రగ్స్ స్మగ్లింగ్ ను అడ్డుకున్న కోస్ట్ గార్డ్..!!
- ఇరాన్ ను హెచ్చరించిన సౌదీ అరేబియా..!!
- యూఏఈలోని భారతీయ స్కూళ్లకు ముందస్తు సెలవులు..!!
- ఘనంగా వంశీ–జమున అంతర్జాతీయ మహిళా పురస్కారాల ప్రదానం
- చరిత్ర సృష్టించిన భారత్.. టీ20 వరల్డ్ కప్ కైవసం
- సౌదీ అరేబియాలో క్షిపణి పడి ఇద్దరు మృతి, 12 మందికి గాయాలు
- కతార్ ఎమిర్–అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మధ్య టెలిఫోన్ సంభాషణ
- ICC Mens T20 World Cup Final: ఫైనల్ మ్యాచ్.. న్యూజిలాండ్ పై భారత్ భారీ స్కోర్
- కువైట్ గగనతలం తాత్కాలిక మూసివేత
- ఇరాన్ పై నెతన్యాహు సంచలన వ్యాఖ్యలు









