మంజు వారియర్ హీరోగా అరవింద్స్వామి
- October 02, 2016
1990లో తనకంటూ ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్న నటుడు అరవింద్స్వామి. అవకాశాలు తగ్గడంతో సినిమాలకు దూరమయ్యారు. చాలా గ్యాప్ తర్వాత ఆయన నటించిన 'తని ఒరువన్' మంచి గుర్తింపు తెచ్చింది. కెరీర్ పరంగా ఆయన రీ ఎంట్రీ ఇచ్చినట్లుగా మారింది. భిన్నమైన పాత్రలో ఇంటెలిజెంట్ విలన్గా నటించి మెప్పించారు. ఆయన శైలి నచ్చినందువల్లే ఈ సినిమా తెలుగు రీమేక్లో కూడా అరవింద్స్వామినే నటించాలని నటుడు రాంచరణ్ కూడా పట్టుబట్టినట్లు సమాచారం. ఇదిలా ఉండగా ప్రస్తుతం ఆయన 'బోగన్'లో మళ్లీ జయంరవితో కలసి నటిస్తున్నారు. తాజాగా 'చదురంగవేట్టె 2' సినిమాలో నటించేందుకు కూడా అంగీకరించారు.
ఇందులో ఆయనకు జంటగా త్రిష నటించడం విశేషం. ఈ నేపథ్యంలో మరో కొత్త సినిమాకు కూడా అరవింద్ సిద్ధమయ్యారు. విజయ్ హీరోగా 'తిరుమలై' సినిమాను రూపొందించిన రమణ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమాలో హీరోగా నటిస్తున్నారు. ఇందులో ప్రముఖ మలయాళ నటి మంజు వారియర్ హీరోయిన్గా నటిస్తున్నారు.
మంజు వారియర్ నటిస్తున్న తొలి తమిళ చిత్రం కూడా ఇదే కావడం విశేషం. యాక్షన్, థ్రిల్లర్ కథాంశంతో దీన్ని రూపొందిస్తున్నట్లు సమాచారం.
తాజా వార్తలు
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!
- వాణిజ్య స్థలాల అద్దెపై కువైట్ ఫైర్ ఫోర్స్ కీలక సూచనలు..!!







