పాకిస్తాన్ ఉగ్రవాదులు మళ్ళీ తెగబడ్డారు...
- October 02, 2016
పాకిస్తాన్ ఉగ్రవాదులు మళ్ళీ తెగబడ్డారు. ఆదివారం రాత్రి పదిన్నర గంటల సమయంలో బారాముల్లా జిల్లాలోని ఆర్మీ క్యాంపు పై టెర్రరిస్టులు ఆత్మాహుతి దాడికి పాల్పడ్డారు. ఓ పబ్లిక్ పార్క్ ద్వారా 46 రాష్ట్ర్రీయ రైఫిల్స్ క్యాంప్ లోకి చొరబడేందుకు ప్రయత్నించి కాల్పులు జరిపారు. భారత జవాన్లకు, వారికి మధ్య జరిగిన కాల్పుల్లో ఒక జవాను మరణించగా మరొకరు గాయపడ్డారు.ఇండియన్ ఆర్మీ కాల్పుల్లో ఇద్దరు ఉగ్రవాదులు చనిపోయారు. టెర్రరిస్టు లు జీలం నది ద్వారా దొంగచాటుగా ఈ జిల్లాలోకి చొరబడినట్టు తెలుస్తోంది. మరోవైపు జమ్మూ జిల్లాలోని పల్లన్ వాలా సెక్టార్ లో పాక్ సైనికులు నియంత్రణ రేఖ వెంబడి పేలుళ్లకు దిగారు. శనివారం కూడా వారు భారత సైనిక పోస్టులు, జనావాస ప్రాంతాల్లో మోర్టార్ బాంబులు, గ్రెనేడ్లతో పేలుళ్లకు పాల్పడ్డారు.
తాజా వార్తలు
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!
- వాణిజ్య స్థలాల అద్దెపై కువైట్ ఫైర్ ఫోర్స్ కీలక సూచనలు..!!
- పర్యావరణ పరిరక్షణలో ఒమన్కు అంతర్జాతీయ గుర్తింపు..!!
- సోషల్ మీడియా బ్యాన్.. క్రియేటర్ ఎకానమీపై ప్రభావంపై యూఏఈ క్లారిటీ..!!
- డొమెస్టిక్ వర్కర్ ను వేధించిన మహిళకు మూడేళ్ల జైలు..!!
- ధోఫార్ ఖరీఫ్ సీజన్.. వినియోగదారుల రక్షణకు 52 మంది అధికారుల నియామకం..!!
- కలర్వర్స్ ఎక్స్పీరియన్స్తో కుటుంబాలకు వినూత్న వినోదం..!!
- జెడ్డాలో భారీగా పట్టుబడ్డ నకిలీ బ్రాండెడ్ దుస్తులు..!!
- కొత్త మల్టిపుల్ ఎంట్రీ వీసాను ప్రవేశపెట్టిన సౌదీ..!!







