సిట్రా బాంబు దాడి కేసులో ఐదుగురి అరెస్టు
- August 14, 2015
గత నెల బహ్రైన్ లోని సిట్రాలో ఇద్దరు పోలీ స్ వారి మృతికి, 5గురు ఇతరుల గాయాలకు కారణమైన బాంబుదాడి కేసులో ఐదుగురు నిందితులను అరెస్టు చేసినట్టు ఆ దేశ ఆంతరంగిక శాఖ వారు నిన్న ప్రకటించారు. అరెస్టు చేయబడిన వారిలో ముగ్గురు ఇరాన్ రేవల్యూషనరీ గార్డ్స్ మరియు ఇరాక్ కు చెందిన హిజ్బొల్లా గ్రూపుకు చెందిన వారి గా గుర్తించినట్టు కూడా తెలియజేశారు. సీత్ర బాంబుదాడి స్థలంలో జరిగిన ఫొరెన్సిక్ పరీక్షలలో హైగ్రేడు పేలుడు పదార్ధం (C4) ను వాడినట్టు మేజర్ జనరల్ అల్ హస్సాన్ తెలియజేశారు. ఇంకా, నిందితుల నుండి తెలుసుకున్న సమాచారం మేరకు వివిధ బాంబులు, బాంబు తయారీ పదార్ధాలు, వాడడానికి సిద్ధం చేసిన బాంబులను కనిపెట్టినట్టు కూడా ఆయన తెలియజేశారు.
--యం.వాసుదేవ రావు (మాగల్ఫ్ ప్రతినిధి,బహ్రెయిన్)
తాజా వార్తలు
- కువైట్లో ఉగ్రవాద నిధుల కుట్ర భగ్నం: 24 మంది అరెస్ట్
- ఢిల్లీ క్యాపిటల్స్ పై చెన్నై సూపర్ కింగ్స్ విజయం
- మే 10 ఎన్టీఆర్ ట్రస్ట్ తలసేమియా రన్కు నారా భువనేశ్వరి పిలుపు
- ప్రాంతీయ భద్రత పై యూఏఈ–భారత్ విదేశాంగ మంత్రుల కీలక చర్చలు
- కీసర టోల్ప్లాజా వద్ద ఘోర ప్రమాదం
- ఆ వార్తలు వేదనకు గురిచేశాయి: దర్శకుడు వేణు ఉడుగుల
- నార్సింగి పోలీస్ స్టేషన్లో సింగర్ మంగ్లీ ఫిర్యాదు
- గాయని ఆశా భోస్లేకు గుండెపోటు..ఆసుపత్రికి తరలింపు
- అమేజాన్ సమ్మర్ సేల్..
- ఏఐ ఎయిర్పోర్ట్ సర్వీసెస్లో ఉద్యోగాలు..









