పాస్పోర్ట్ బిడ్డింగ్ని రద్దు చేసిన ఇండియన్ ఎంబసీ
- October 03, 2016
అబుదాబీ: అబుదాబీలోని ఇండియన్ ఎంబసీ, ఇండియన్ పాస్పోర్ట్ మరియు వీసా అప్లికేషన్లను ప్రాసెస్ చేసేందుకుగాను కొత్త ఏజెన్సీ కోసం ప్రారంభించిన బిడ్డింగ్ ప్రాసెస్ని రద్దు చేసింది. ఈ మేరకు సీనియర్ డిప్లమాట్ స్పష్టతనిచ్చారు. కొన్ని సాంకేతిక సమస్యలతో టెండర్ ప్రక్రియను రద్దు చేసినట్లు అబుదాబీ ఇండియన్ ఎంబసీ ప్రతినిథి నీతా భూషన్ చెప్పారు. ఈ సేవల్ని మూడేళ్ళపాటు అందించిన బిఎల్ఎస్ ఇంటర్నేషనల్ సంస్థ టెర్మ్ గత ఏడాదితో ముగిసిందనీ, అయినప్పటికీ ఆగస్ట్ 2016 వరకూ పొడిగించామనీ భూషన్ వివరించారు. అలాగే తాజా పరిణామాల నేపథ్యంలో మరోమారు బిఎల్ఎస్ టెర్మ్ని 2017 జనవరి వరకూ పొడిగించినట్లు తెలిపారు. త్వరలోనే కొత్త బిడ్డింగ్ ప్రాసెస్ని ప్రారంభిస్తామని ఆమె చెప్పారు. ఈ మార్పుల కారణంగా పాస్పోర్ట్ సేవలకు ఎలాంటి ఇబ్బందీ ఉండదనీ, కొన్నిసార్లు తలెత్తుతున్న ఇబ్బందులు సాంకేతిక పరమైనవి మాత్రమేననీ, వాటిల్లో లీగల్ సమస్యలు ముఖ్యమైనవని ఆమె స్పష్టం చేశారు.
తాజా వార్తలు
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!
- వాణిజ్య స్థలాల అద్దెపై కువైట్ ఫైర్ ఫోర్స్ కీలక సూచనలు..!!







