పాస్పోర్ట్ బిడ్డింగ్ని రద్దు చేసిన ఇండియన్ ఎంబసీ
- October 03, 2016
అబుదాబీ: అబుదాబీలోని ఇండియన్ ఎంబసీ, ఇండియన్ పాస్పోర్ట్ మరియు వీసా అప్లికేషన్లను ప్రాసెస్ చేసేందుకుగాను కొత్త ఏజెన్సీ కోసం ప్రారంభించిన బిడ్డింగ్ ప్రాసెస్ని రద్దు చేసింది. ఈ మేరకు సీనియర్ డిప్లమాట్ స్పష్టతనిచ్చారు. కొన్ని సాంకేతిక సమస్యలతో టెండర్ ప్రక్రియను రద్దు చేసినట్లు అబుదాబీ ఇండియన్ ఎంబసీ ప్రతినిథి నీతా భూషన్ చెప్పారు. ఈ సేవల్ని మూడేళ్ళపాటు అందించిన బిఎల్ఎస్ ఇంటర్నేషనల్ సంస్థ టెర్మ్ గత ఏడాదితో ముగిసిందనీ, అయినప్పటికీ ఆగస్ట్ 2016 వరకూ పొడిగించామనీ భూషన్ వివరించారు. అలాగే తాజా పరిణామాల నేపథ్యంలో మరోమారు బిఎల్ఎస్ టెర్మ్ని 2017 జనవరి వరకూ పొడిగించినట్లు తెలిపారు. త్వరలోనే కొత్త బిడ్డింగ్ ప్రాసెస్ని ప్రారంభిస్తామని ఆమె చెప్పారు. ఈ మార్పుల కారణంగా పాస్పోర్ట్ సేవలకు ఎలాంటి ఇబ్బందీ ఉండదనీ, కొన్నిసార్లు తలెత్తుతున్న ఇబ్బందులు సాంకేతిక పరమైనవి మాత్రమేననీ, వాటిల్లో లీగల్ సమస్యలు ముఖ్యమైనవని ఆమె స్పష్టం చేశారు.
తాజా వార్తలు
- టీమిండియాదే విజయం..కివీస్తో ఫైనల్ పోరుకు రెడీ..
- ఖమేనీ మృతికి అధికారికంగా సంతాపం తెలిపిన భారత్
- ICC Mens T20 World Cup 2026: భారత్ భారీ స్కోర్..
- అమెరికా ట్యాంకర్ పై దాడి చేసిన ఇరాన్
- గల్ఫ్ దేశాలకు ఇటలీ బాసట
- షార్జా ఛారిటీ రికార్డు: మొదటి 15 రోజుల్లోనే 4.5 లక్షల ఇఫ్తార్ భోజనాల పంపిణీ!
- అబూదాబీ ICAD 2పై డ్రోన్ శకలాలు: ఆరుగురికి గాయాలు..
- Dh15 మిలియన్ జాక్పాట్ కొట్టిన షార్జా డ్రైవర్..!!
- పబ్లిక్ ప్లేసుల్లో అలాచేస్తే..OMR 300 ఫైన్, 3 నెలల జైలు..!!
- రిలీఫ్ ఫ్లైట్స్..ఖతార్ ఎయిర్వేస్ బిగ్ అప్డేట్..!!









