దుబాయ్ మెట్రోలో ఆర్టిఎ 3డి ప్రింటింగ్
- October 03, 2016
దుబాయ్: దుబాయ్ రోడ్స్ అండ్ ట్రాన్స్పోర్ట్ అథారిటీ (ఆర్టిఎ), టివిఎమ్ (టికెట్ వెండింగ్ మెషీన్స్), టికెట్ గేట్స్కి సంబంధించి కొన్ని ముఖ్యమైన విభాగాల కోసం త్రీడి ప్రింటింగ్ విధానాన్ని ప్రారంభించింది. ప్రపంచ వ్యాప్తంగా త్రీడీ ప్రింటింగ్ టెక్నాలజీ సరికొత్త సంచలనాలకు తెరలేపిందనీ, ఈ కారణంగానే ఆర్టిఎ త్రీడి టెక్నాలజీని అందుబాటులోకి తీసుకొచ్చిందని ఆర్టిఎ రైల్ ఏజెన్సీ సిఇఓ అబ్దుల్ మొహిసిన్ ఇబ్రహీమ్ యూనెస్ తెలిపారు. త్రీడీ ప్రింటింగ్ విధానం ద్వారా కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ని తగ్గించగలుగుతున్నామనీ, తద్వారా తగ్గే వ్యయం చాలా ఎక్కువగానే ఉంటోందనీ, దీని ద్వారా వినియోగదారులకు మెరుగైన సేవలు అందించడంతోపాటు, వారికీ ఆర్థిక భారం తగ్గించడానికి వీలు కుదురుతుందని ఆయన తెలిపారు. వేస్టేజ్ తగ్గించడం, మెరుగైన ఉత్పత్తుల్ని తయారు చేయడం వంటివి త్రీడి ప్రింటింగ్ టెక్నాలజీలో సంచలనాలుగా చెప్పవచ్చు. రీసైక్లింగ్ కూడా ఎంతో తేలికైన పని కావడంతో త్రీడి టెక్నాలజీ ప్రపంచ వ్యాప్తంగా అద్భుతాల్ని సృష్టిస్తోంది.
తాజా వార్తలు
- టీమిండియాదే విజయం..కివీస్తో ఫైనల్ పోరుకు రెడీ..
- ఖమేనీ మృతికి అధికారికంగా సంతాపం తెలిపిన భారత్
- ICC Mens T20 World Cup 2026: భారత్ భారీ స్కోర్..
- అమెరికా ట్యాంకర్ పై దాడి చేసిన ఇరాన్
- గల్ఫ్ దేశాలకు ఇటలీ బాసట
- షార్జా ఛారిటీ రికార్డు: మొదటి 15 రోజుల్లోనే 4.5 లక్షల ఇఫ్తార్ భోజనాల పంపిణీ!
- అబూదాబీ ICAD 2పై డ్రోన్ శకలాలు: ఆరుగురికి గాయాలు..
- Dh15 మిలియన్ జాక్పాట్ కొట్టిన షార్జా డ్రైవర్..!!
- పబ్లిక్ ప్లేసుల్లో అలాచేస్తే..OMR 300 ఫైన్, 3 నెలల జైలు..!!
- రిలీఫ్ ఫ్లైట్స్..ఖతార్ ఎయిర్వేస్ బిగ్ అప్డేట్..!!









