దుబాయ్ మెట్రోలో ఆర్టిఎ 3డి ప్రింటింగ్
- October 03, 2016
దుబాయ్: దుబాయ్ రోడ్స్ అండ్ ట్రాన్స్పోర్ట్ అథారిటీ (ఆర్టిఎ), టివిఎమ్ (టికెట్ వెండింగ్ మెషీన్స్), టికెట్ గేట్స్కి సంబంధించి కొన్ని ముఖ్యమైన విభాగాల కోసం త్రీడి ప్రింటింగ్ విధానాన్ని ప్రారంభించింది. ప్రపంచ వ్యాప్తంగా త్రీడీ ప్రింటింగ్ టెక్నాలజీ సరికొత్త సంచలనాలకు తెరలేపిందనీ, ఈ కారణంగానే ఆర్టిఎ త్రీడి టెక్నాలజీని అందుబాటులోకి తీసుకొచ్చిందని ఆర్టిఎ రైల్ ఏజెన్సీ సిఇఓ అబ్దుల్ మొహిసిన్ ఇబ్రహీమ్ యూనెస్ తెలిపారు. త్రీడీ ప్రింటింగ్ విధానం ద్వారా కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ని తగ్గించగలుగుతున్నామనీ, తద్వారా తగ్గే వ్యయం చాలా ఎక్కువగానే ఉంటోందనీ, దీని ద్వారా వినియోగదారులకు మెరుగైన సేవలు అందించడంతోపాటు, వారికీ ఆర్థిక భారం తగ్గించడానికి వీలు కుదురుతుందని ఆయన తెలిపారు. వేస్టేజ్ తగ్గించడం, మెరుగైన ఉత్పత్తుల్ని తయారు చేయడం వంటివి త్రీడి ప్రింటింగ్ టెక్నాలజీలో సంచలనాలుగా చెప్పవచ్చు. రీసైక్లింగ్ కూడా ఎంతో తేలికైన పని కావడంతో త్రీడి టెక్నాలజీ ప్రపంచ వ్యాప్తంగా అద్భుతాల్ని సృష్టిస్తోంది.
తాజా వార్తలు
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!







