భారత పర్యటనకు వచ్చిన సింగపూర్ ప్రధాని లీ హెసైన్ లూంగ్..
- October 04, 2016
భారత పర్యటనకు వచ్చిన సింగపూర్ ప్రధాని లీ హెసైన్ లూంగ్ బస్సు ఎక్కి అందరినీ ఆశ్చర్యపరిచారు. అయిదు రోజుల పర్యటన నిమిత్తం భారత్కు వచ్చిన లూంగ్ దిల్లీలో వీఐపీ కాన్వాయ్లో కాకుండా చార్టర్డ్ బస్సులో తను బస చేసే హోటల్కు వెళ్లారు. లూంగ్తో పాటు ఆయన సతీమణి హో చింగ్, పలువురు కీలక మంత్రులు, ఎంపీలు, సీనియర్ అధికారులు భారత్కు చేరుకున్నారు. సోమవారం రాత్రి ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో వారికి కేంద్ర మంత్రి ఇంద్రజిత్ సింగ్ ఘన స్వాగతం పలికారు. విమానాశ్రయం నుంచి హోటల్కు వెళ్లడానికి లూంగ్ వీఐపీ కాన్వాయ్కు బదులుగా చార్టర్డ్ బస్సును ఎంచుకున్నారు.ఈరోజు భారత ప్రధాని నరేంద్ర మోదీ సింగపూర్ ప్రధాని లూంగ్ గౌరవార్థం వారికి అధికారిక విందు ఇవ్వనున్నారు. ఇరువురు నేతలు ద్వైపాక్షిక చర్చల్లో పాల్గొంటారు. అలాగే పలు ఒప్పందాలపై సంతకాలు చేయనున్నారు. భారత పర్యటనలో భాగంగా లూంగ్ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ, విదేశాంగ శాఖ మంత్రి సుష్మాస్వరాజ్లతోనూ సమావేశం కానున్నారు.అక్టోబరు 5, 6 తేదీల్లో లూంగ్ రాజస్థాన్లోని ఉదయ్పూర్ పర్యటనకు వెళ్లనున్నారు. రాజస్థాన్ ముఖ్యమంత్రి వసుంధర రాజే వారికి అధికారికంగా విందు ఏర్పాటు చేయనున్నారు.
తాజా వార్తలు
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!







