ఆన్లైన్ షాపింగ్ సైట్స్ మరికొద్ది రోజుల్లో శుభం కార్డ్ పడటం ఖాయం..
- October 04, 2016
ఆన్లైన్ షాపింగ్ సైట్స్లో షాపింగ్ చేసేవారి సంఖ్య రోజురోజుకూ గణనీయంగా పెరుగుతోంది. సైట్స్ కూడా రోజుకొకటి పుట్టుకొస్తున్నాయి. జనవరి 2014 లెక్కల ప్రకారం దాదాపు ఇండియాలో 200 మిలియన్ల మంది ఆన్లైన్లో షాపింగ్ చేసే రెగ్యులర్ యూజర్లు ఉన్నట్లు తెలిసింది. ఈ లెక్కల ప్రకారం ఆన్లైన్ షాపింగ్ సైట్స్ లాభాల బాటలో పయనిస్తున్నాయని చెప్పక తప్పదు. అయితే ఇదంతా నాణానికి ఒకవైపు. ఏవో ఆ రెండు, మూడు ప్రముఖ సైట్స్ తప్ప మిగిలిన చాలా చిన్నాచితకా సైట్స్ నష్టాలను చవిచూస్తున్నాయి. అకస్మాత్తుగా మూసేయలేక, కొనసాగించలేక మల్లగుల్లాలు పడుతున్నాయి. ఇప్పటికే మెట్రో నగరాల్లో మాత్రమే ఆన్లైన్ సేవలందించే నాలుగు వెబ్సైట్స్ తమ సేవలను నిలిపివేస్తున్నట్లు ప్రకటించాయి.అయితే కొన్ని వస్తువులపై అమ్మకాలను మాత్రమే నిలిపివేస్తున్నట్లు ప్రకటించినప్పటికీ, దాదాపుగా మరికొద్ది రోజుల్లో శుభం కార్డ్ పడటం ఖాయంగానే కనిపిస్తోంది. మరికొద్ది రోజుల్లోనే ఆ షాపింగ్ సైట్స్ పేర్లను వెల్లడించే అవకాశముంది. ప్రముఖ ఆన్లైన్ షాపింగ్ సైట్స్ ప్రకటిస్తున్న ఆఫర్లు, డిస్కౌంట్స్ను తట్టుకుని నిలబడలేకే ఈ నిర్ణయానికొచ్చినట్లు తెలుస్తోంది. అయితే ఈ పరిణామం కొత్తేమీ కాదు.గతంలో కూడా అలా మూతపడిన షాపింగ్ సైట్స్ ఉన్నాయి. వాటి వివరాలివి... 1. కూల్కార్ట్.కామ్(సంస్థ కోఫౌండర్ తప్పుకోవడంతో మూసివేయాలని నిర్ణయం) 2.మిరాయిస్టోర్, బెంగళూరు 3. రాక్.ఇన్, ముంబై 4. తింతరా.కామ్
తాజా వార్తలు
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!







