2 మిలియన్లు దాటిన ఖతార్ విజిటర్స్
- October 05, 2016
ఖతార్: ఈ ఏడాది ఇప్పటిదాకా ఖతార్ని సందర్శించినవారి సంఖ్య 2.182 మిలియన్లకు చేరుకుందని ఖతార్ టూరిజం అథారిటీ (క్యుటిఎ) వర్గాలు వెల్లడించాయి. సెప్టెంబర్లో జిసిసి దేశాలకు చెందినవారు ఎక్కువగా ఖతార్ని విజిట్ చేసినట్లు గణాంకాలు వెల్లడిస్తున్నాయి. 2015తో పోల్చితే సౌదీ అరేబియా, యూఏఈలనుంచి వచ్చినవారి సంఖ్య 8 శాతం, 17 శాతం పెరుగుదల నమోదయ్యింది. బహ్రెయిన్, కువైట్ నుంచి వచ్చిన వారి శాతం 3 మరియు 2 అధికంగా ఉంది. ఒమన్ నుంచి వచ్చినవారి సంఖ్యలో మాత్రం 5 శాతం తగ్గుదల నమోదయ్యింది. జిసిసి రీజియన్ నుంచి వచ్చినవారి సంఖ్య 7 శాతం పెరుగుదల నమోదు చేసింది. సెప్టెంబర్లో కేవలం సౌదీ నుంచి వచ్చినవారి సంఖ్య 100,000గా ఉంది. ఖతార్ తొలిసారిగా క్రూయిజ్ షిప్ని అక్టోబర్ 18న 45 దేశాలకు చెందిన టూరిస్టుల్ని ఆహ్వానించనుంది. క్యుటిఎ ముందు ముందు మరింతగా విజిటర్స్ని ఆకర్షించేందుకు సరికొత్త ప్రణాళికలు సిద్ధం చేయనుంది.
తాజా వార్తలు
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!







