నీయామీశరణార్థుల శిబిరం వద్ద కాపలాగా ఉన్న సైనికులపై ఉగ్రవాదుల దాడి..
- October 06, 2016
శరణార్థుల శిబిరం వద్ద కాపలాగా ఉన్న సైనికులపై ఉగ్రవాదుల జరిపిన కాల్పుల్లో 22 మంది మృతి చెందారు. ఈ ఘటన నైగర్ పశ్చిమ సరిహద్దు ప్రాంతం టస్సారా వద్ద చోటుచేసుకుంది. మాలి శరణార్దులకు రక్షణ కల్పిస్తున్న సైనికులను లక్ష్యంగా చేసుకొని ఉగ్రవాదులు ఈ దాడికి పాల్పడ్డారని జిన్హువా వార్తాసంస్థ తెలిపింది.అయితే ఈ ఘటనపై నైగర్ ప్రభుత్వం పూర్తి వివరాలను వెల్లడించనప్పటికీ.. నైగర్స్ నేషనల్ టెలివిజన్ గురువారం రాత్రి సైనికులపై దాడి జరిగిన విషయాన్ని ప్రకటించింది. ఈ ఘటనలో భారీ ప్రాణనష్టం జరిగిందని వెల్లడించింది. దాడికి పాల్పడిన ఉగ్రవాదుల కోసం సైనికులు ఆ ప్రాంతమంతా జల్లెడపడుతున్నారు. ఉగ్రవాదులు మాలి ఉత్తరప్రాంతానికి చెందిన వారై ఉంటారని భావిస్తున్నారు.
తాజా వార్తలు
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!







