ప్రముఖ కమెడియన్‌ పృథ్విపై పోలీసులు కేసు నమోదు

- October 09, 2016 , by Maagulf
ప్రముఖ కమెడియన్‌ పృథ్విపై పోలీసులు కేసు నమోదు

ప్రముఖ కమెడియన్‌ పృథ్విపై పోలీసులు కేసు నమోదు చేశారు. పృథ్వి తనను వివాహం చేసుకుని మోసం చేశాడని ఓ మహిళ పోలీసులను ఆశ్రయించింది. బాధితురాలి ఫిర్యాదుపై 498ఏ, 420 సెక్షన్ల కింద బంజారాహిల్స్‌ పోలీస్‌స్టేషన్‌లో కేసు నమోదు చేశారు. టాలీవుడ్ ఇండస్ట్రీలో ప్రస్తుతం బిజీ కమెడియన్‌గా వెలుగొందుతున్నపృథ్వీ 30 ఇయర్ ఇండస్ట్రీ డైలాగ్‌తో సూపర్ క్రేజ్‌ను సొంతం చేసుకున్నాడు. ఇండస్ట్రీ తొలి దశలో పలు ఇబ్బందులు ఎదుర్కొన్న ఈ కమెడియన్ ప్రస్తుతం చేతి నిండా సినిమాలతో బిజీగా ఉన్నాడు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com