సర్జికల్ స్రైక్స్‌కు ప్రతీకారంగా భారత పార్లమెంట్‌పై దాడి ఉగ్రవాదుల టార్గెట్..

- October 09, 2016 , by Maagulf
సర్జికల్ స్రైక్స్‌కు ప్రతీకారంగా భారత పార్లమెంట్‌పై దాడి ఉగ్రవాదుల టార్గెట్..

సర్జికల్ దాడులకు ప్రతీకారం తీర్చుకోవాలని పాక్ భావిస్తోందా? ఇండియాలోని ప్రముఖ ప్రదేశాలపై ఉగ్రవాదుల కన్ను పడిందా? ఈ నెల ముగిసే లోపు భారీ ఉగ్రదాడి జరగబోతోందా? ఈ ప్రశ్నలన్నింటికీ అవుననే సమాధానమిస్తున్నాయి నిఘా వర్గాలు. పాక్ ఏ క్షణంలోనైనా దాడికి తెగబడొచ్చని హెచ్చరికలు జారీ చేస్తున్నాయి. భారత సైన్యం కూడా ఉగ్రవాదులను ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నట్లు ఆర్మీ చీఫ్ ఇప్పటికే ప్రకటించారు. ఈ నేపథ్యంలోనే మరో విషయం తెలిసింది. సర్జికల్ స్రైక్స్‌కు ప్రతీకారంగా భారత పార్లమెంట్‌పై దాడి చేయాలని జైష్ ఇ ముహ్మద్(జేఈఎం) ఉగ్రవాద సంస్థ ప్లాన్ చేసినట్లు ఇంటెలిజెన్స్ హెచ్చరించింది. జేఈఎం చీఫ్ మౌలానా మసూద్ అజర్ ఈ నిర్ణయానికొచ్చినట్లు హెచ్చరించింది.

మెరుపు దాడులు చేసి భారత్‌ను కోలుకోలేని దెబ్బ కొట్టాలని ఈ పాక్ ఆధారిత ఉగ్రవాద సంస్థ భావిస్తున్నట్లు నిఘా వర్గాలు భారత్‌ను హెచ్చరించాయి.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com