శ్రీలంక క్రికెటర్లపై దాడికి సూత్రధారి మృతి....
- October 09, 2016
కరుడుగట్టిన పాకిస్థానీ ఉగ్రవాది క్యూరీ అజ్మల్ను ఆఫ్ఘనిస్థాన్-అమెరికా ప్రత్యేక బలగాలు మట్టుబెట్టాయి. 2009లో శ్రీలంక క్రికెటర్లపై జరిగిన దాడికి సూత్రధారి అజ్మల్. పాకిస్థాన్ను వణికించిన అనేక ప్రధాన ఉగ్రవాద దాడుల్లో అజ్మల్ కీలక పాత్ర పోషించాడు. నిషేధిత లష్కరే-ఈ-జంగీ ఉగ్రవాద సంస్థలో ్ఞఅగ్ర నేతగా వ్యవహరించాడు. అతడికి తెహ్రిక్-ఈ-తాలిబ న్(పాకిస్థాన్) ఉగ్రవాద సంస్థతో బలమైన సంబంధాలు ఉన్నాయి. గత కొంతకాలంగా పాకిస్థాన్, ఆఫ్ఘనిస్థాన్ సరిహద్దులోని పాక్ టిక్కాలో తలదాంచుకుంటున్నాడు.పాక్ టిక్కాలోని తాలిబ న్ స్థావరాలపై జరిపిన దాడుల్లో అజ్మల్ మృతి చెందినట్టు మీడియా వర్గాలు వెల్లడించాయి. ఈ ఘటనలో కొంత మంది తాలిబన్ నేతలనూ సజీవంగా పట్టుకున్నట్టు అక్కడి గిరిజనులు చెబుతున్నారు.
తాజా వార్తలు
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!
- వాణిజ్య స్థలాల అద్దెపై కువైట్ ఫైర్ ఫోర్స్ కీలక సూచనలు..!!
- పర్యావరణ పరిరక్షణలో ఒమన్కు అంతర్జాతీయ గుర్తింపు..!!
- సోషల్ మీడియా బ్యాన్.. క్రియేటర్ ఎకానమీపై ప్రభావంపై యూఏఈ క్లారిటీ..!!







