శ్రీలంక క్రికెటర్లపై దాడికి సూత్రధారి మృతి....

- October 09, 2016 , by Maagulf
శ్రీలంక క్రికెటర్లపై దాడికి సూత్రధారి మృతి....

కరుడుగట్టిన పాకిస్థానీ ఉగ్రవాది క్యూరీ అజ్మల్‌ను ఆఫ్ఘనిస్థాన్‌-అమెరికా ప్రత్యేక బలగాలు మట్టుబెట్టాయి. 2009లో శ్రీలంక క్రికెటర్లపై జరిగిన దాడికి సూత్రధారి అజ్మల్‌. పాకిస్థాన్‌ను వణికించిన అనేక ప్రధాన ఉగ్రవాద దాడుల్లో అజ్మల్‌ కీలక పాత్ర పోషించాడు. నిషేధిత లష్కరే-ఈ-జంగీ ఉగ్రవాద సంస్థలో ్ఞఅగ్ర నేతగా వ్యవహరించాడు. అతడికి తెహ్రిక్‌-ఈ-తాలిబ న్‌(పాకిస్థాన్‌) ఉగ్రవాద సంస్థతో బలమైన సంబంధాలు ఉన్నాయి. గత కొంతకాలంగా పాకిస్థాన్‌, ఆఫ్ఘనిస్థాన్‌ సరిహద్దులోని పాక్‌ టిక్కాలో తలదాంచుకుంటున్నాడు.పాక్‌ టిక్కాలోని తాలిబ న్‌ స్థావరాలపై జరిపిన దాడుల్లో అజ్మల్‌ మృతి చెందినట్టు మీడియా వర్గాలు వెల్లడించాయి. ఈ ఘటనలో కొంత మంది తాలిబన్‌ నేతలనూ సజీవంగా పట్టుకున్నట్టు అక్కడి గిరిజనులు చెబుతున్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com