ఉత్తర మయన్మార్ ఘర్షణల్లో 12మంది మృతి
- October 12, 2016
ఉత్తర మయన్మార్లోని రాఖినే రాష్ట్రంలో సాయుధ బలగాలు, సాయుధ గ్రూపు మధ్య జరిగిన ఘర్షణల్లో 12మంది మరణించారని ప్రభుత్వ మీడియా బుధవారం తెలిపింది. ప్రధానంగా రోహింగ్యా ముస్లిమ్ ప్రాబల్యం వుండే మాంగ్దా టౌన్షిప్లో మంగళవారం వందలాదిమంది వ్యక్తులు పిస్టళ్లు, కత్తులు ధరించి సైనిక బలగాలపై దాడులు చేయడంతో నలుగురు సైనికులు మరణించగా దాడి చేసిన వారు ఏడుగురు మరణించినట్లు ప్రభుత్వ ఆధ్వర్యంలో నడిచే గ్లోబల్ న్యూ లైట్ ఆఫ్ మయన్మార్ పేర్కొంది. మరణించిన వారి దగ్గర కత్తులు, కర్రలు కూడా వున్నాయి. ఈ దాడులు జరిగిన ప్రాంతం బంగ్లాదేశ్ సరిహద్దుకు ఎంతో దూరంలో లేదు. మూడు సరిహద్దు పోస్ట్లపై ఆదివారం జరిగిన దాడిలో 9మంది పోలీసు అధికారులు మరణించడంతో సైన్యం అక్కడ రంగంలోకి దిగింది.
ప్రస్తుత పరిస్థితులు చూస్తుంటే 2012లో జరిగిన రోహింగ్యా హింసాకాండ పరిస్థితులు గుర్తుకు వస్తున్నాయి. ఆనాటి హింసాకాండలో వంద మందికి పైగా మృతి చెందారు. శరణార్ధ శిబిరాల్లో వేలాదిమంది తలదాచుకున్నారు. రోహింగ్యా ముస్లిమ్లను బంగ్లాదేశ్ నుండి వచ్చిన అక్రమ శరణార్ధులుగా బౌద్ధ జాతీయులు పరిగణిస్తారు.
వీరిలో చాలామందికి కొన్ని తరాల వెనుక మయన్మార్తో సంబంధాలున్నప్పటికీ వారిని ఇక్కడివారుగా ఒప్పుకోరు. కాగా ఈ సరిహద్దు దాడుల వెనుక గల ఆరుగురు అనుమానితుల్లో నలుగురిని మంగవారం పట్టుకున్నారు. కాగా సంయమనం పాటించాల్సిందిగా మయన్మార్లో ఐరాస ప్రత్యేక సలహాదారు విజరు నంబియార్ సైన్యానికి, ప్రజలకు విజ్ఞప్తి చేశారు.
తాజా వార్తలు
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!







