థాయిలాండ్‌ రాజు మృతి

- October 13, 2016 , by Maagulf
థాయిలాండ్‌ రాజు మృతి

గత కొంతకాలంగా ఆనారోగ్యంతో బాధపడుతున్న థాయిలాండ్‌ రాజు భూమిబోల్‌ అదుల్యతేజ్‌(88) గురువారం కన్నుమూశారు. ప్యాలెస్‌ అధికారులు ఈ మేరకు అధికారిక ప్రకటనను విడుదల చేశారు. ప్రపంచంలోనే అత్యంత ఎక్కువ కాలం పదవిలో ఉన్న రాజుగా అదుల్యతేజ్‌ ఉన్నారు. ఆయన మృతితో థాయిలాండ్‌ వాసులు తీవ్ర శోకంలో మునిగారు. గతేడాది నుంచి ఆయన అనారోగ్య కారణాలతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఆయన ఆరోగ్యం క్షీణించిందని ఆదివారం నాడే రాజభవనం అధికారులు ప్రకటించిన సంగతి తెలిసిందే.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com