కెఎస్ఎ పబ్లిక్ స్కూల్స్లో 1.1 మిలియన్ విదేశీ విద్యార్థులు
- October 13, 2016
జెడ్డా: సౌదీ మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్ వెల్లడించిన వివరాల ప్రకారం 1.1 మిలియన్ విదేశీ స్టూడెంట్స్, కింగ్డమ్లోని పబ్లిక్ స్కూల్స్లో ఎన్రోల్ అయినట్లు తెలుస్తుంది. వీరందరికీ ఉచిత విద్య అందించనున్నారు. నౌర్ పబ్లిక్ ఎడ్యుకేషన్ సిస్టమ్లో రిజిస్టర్ అయిన మొత్తం విద్యార్థుల సంఖ్య 6 మిలియన్లుగా ఉందని మినిస్ట్రీ వర్గాలు తెలిపాయి. 1.1 మిలియన్ విదేశీ విద్యార్థుల్లో 252,842 మంది యెమన్ జాతీయులు కాగా, 131,297 మంది సిరియన్లు, 41,209 మంది బర్మీస్, మిగతావారంతా పాలస్తీనియన్లు, ఈజిప్టియన్లు, సుడానీస్ మరియు ఆసియా, అరబ్ జాతీయులు. సిరియా, యెమెన్లో ఉన్న ప్రత్యేక పరిస్థితుల దృష్ట్యా అక్కడి నుంచి వచ్చే విద్యార్థులకు గౌరవంతో కూడిన విద్య లభించే చర్యలు తీసుకుంటున్నట్లు అధికారులు తెలిపారు. తమకు సౌదీలో దొరుకుతున్న ఆతిథ్యం చాలా గొప్పగా ఉందని సిరియా, యెమెన్లకు చెందిన విద్యార్థులు, వారి తల్లిదండ్రులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
తాజా వార్తలు
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!







