రాజధాని రియాల్లీ షో రెండవ ఘట్టం
- October 14, 2016
వచ్చే ఏడాది దసరా నాటికి అమరావతికి ఒక పూర్తి రూపం తీసుకుని వస్తాను అని ప్రజలకి బహిరంగ లేఖ రాశారు ముఖ్యమంత్రి చంద్రబాబు. దసరా రోజున వెలగపూడి లో కొత్త కార్యాలయం లోకి ప్రవేశించే ముందరే ఈ లేఖ ఆయన రాసిన సంగతి తెలిసిందే. ఇది రాజకీయంగా కూడా ఆయన తప్పకుండా చెయ్యాల్సిన ప్రకటనగా చెప్పొచ్చు ఎందుకంటే ఈ ప్రభుత్వం పదవీ కాలం చేపట్టి దాదాపు రెండున్నర ఏళ్ళు పూర్తయ్యింది. మూడేళ్ళు ముగియడం తోనే ఎన్నికలు మొదలు అవుతాయి.అనుభవశాలి గనక చంద్రబాబు రాష్ట్రాభివృద్ధి, ముఖ్యంగా రాజధాని నిర్మాణం చేయగలరని ఓటర్లు భావించే అవకాశం చాలా వుంటుందని వైసీపీ నాయకులు కూడా ముందునుంచే చెబుతూ వచ్చారు. విచిత్రమేమంటే విమర్శల మధ్యనే భూ సమీకరణకు రైతులు సహకరించినా కేంద్రం దాదాపు 2000 కోట్లు వివిధ రూపాల్లో ఇచ్చినా సింగపూర్తో సింక్ కాంట్రాక్టర్లను ఎంపిక బాగా సమయం తీసుకున్నాయి.సింగపూర్ సింగపూర్ అంటూ గత ఎన్నికల ముందర నుంచీ , ఎన్నికల్లో గెలిచిన తరవాత కూడా ఊదరగొట్టేసారు. బ్రిడ్జి ల దగ్గర నుంచీ బాత్ రూమ్ ల వరకూ అంతా సింగపూర్ నుంచి ఇంపోర్టింగ్ అనీ అక్కడి డిజైన్ లు తప్ప దేశీయ డిజైన్ లు తమకి వద్దే వద్దు అంటూ బాబుగారు సూపర్ కలరింగ్ ఇచ్చుకుంటూ వచ్చారు.కట్ చేస్తే ఎక్కడ నుంచి ఇప్పటివరకూ అందింది జీరో. తెలుగుదేశం నాయకుల్లోనే ఈ విషయం మీద తీవ్ర అసంతృప్తి ఉంది అంటే పరిస్థితి అర్ధం చేసుకోవచ్చు. ఈ సింగపూర్ ని అక్కడి కంపెనీలనీ లాక్కు రావడం కోసం కొత్త ఎత్తు వేస్తున్నారు బాబుగారు. అందులో భాగంగానే ప్రభుత్వం తన వంతుగా కార్యాలయాలు శాసన సభ , హాయ్ కోర్టు , రాజ్ భవన్ లాంటివి నిర్మిస్తూ వస్తుంది. ఆ దెబ్బకి భూముల విలువ అమాంతం పెరుగుతుంది. అది చూసి అయినా సింగపూర్ బాబులు వస్తారు అనీ పెరిగిన రేట్ లకి తమ వాటా అమ్ముకోవడం మొదలెడతారు అని ప్లాన్ అనమాట. వారిది అమ్ముడయ్యేవరకూ మిగిలిన భూమి అమ్మడానికి వుండదు. పైగావారికి అనుకున్న ప్రతిఫలం రాకపోతే గడువును పెంచాలి. షరతులు మార్చాలి. ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రభుత్వమే ఏర్పాటుచేయాలి.మరొక పక్క ఇచ్చిన భూమికి ప్రతిఫలంగా ప్లాట్లు వచ్చిన రైతులని కూడా కమర్షియల్ కాంట్రాక్టుల కింద బిల్డింగ్ లు నిర్మించుకోవాలని కోరతారు. కొంతమంది అలా ఇచ్చిన తర్వాత చిన్న చితక ఎలాగూ ఒంటిరి గా చేయలేరు గనక అప్పగించకతప్పదు. పైగా వారినుంచి ఆ ప్టాట్లు కొనుగోలు చేయడం ప్రత్యక్ష పరోక్ష ఒత్తిళ్లతో ఒప్పందాల్లో ఇరికించడం జరగొచ్చు.. ఆ విధంగా రాజధాని రియాల్లీ షో రెండవ ఘట్టం నడుస్తుంది. ప్రభుత్వం నుంచి ఎవ్వరూ కనపడకుండా వెనక నుంచి కథ నడిపిస్తారు. మహేష్ బాబు లాంటి సూపర్ స్టార్ లతో ఇప్పటి నుంచే ప్రమోషన్ చేయిస్తున్నారు అంటే ఇలాంటి ఎన్నో హడావిడులు త్వరలో చూడాల్సి వస్తుంది.
తాజా వార్తలు
- టీమిండియాదే విజయం..కివీస్తో ఫైనల్ పోరుకు రెడీ..
- ఖమేనీ మృతికి అధికారికంగా సంతాపం తెలిపిన భారత్
- ICC Mens T20 World Cup 2026: భారత్ భారీ స్కోర్..
- అమెరికా ట్యాంకర్ పై దాడి చేసిన ఇరాన్
- గల్ఫ్ దేశాలకు ఇటలీ బాసట
- షార్జా ఛారిటీ రికార్డు: మొదటి 15 రోజుల్లోనే 4.5 లక్షల ఇఫ్తార్ భోజనాల పంపిణీ!
- అబూదాబీ ICAD 2పై డ్రోన్ శకలాలు: ఆరుగురికి గాయాలు..
- Dh15 మిలియన్ జాక్పాట్ కొట్టిన షార్జా డ్రైవర్..!!
- పబ్లిక్ ప్లేసుల్లో అలాచేస్తే..OMR 300 ఫైన్, 3 నెలల జైలు..!!
- రిలీఫ్ ఫ్లైట్స్..ఖతార్ ఎయిర్వేస్ బిగ్ అప్డేట్..!!









