ఎం రత్నం తాజా ప్రాజెక్టులో పవన్‌కు జోడీగా నయనతార..

- October 14, 2016 , by Maagulf
ఎం రత్నం తాజా ప్రాజెక్టులో పవన్‌కు జోడీగా నయనతార..

 టాలీవుడ్ స్టార్ పవన్‌కళ్యాణ్ కిశోర్ కుమార్ పార్థసాని దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమా సెట్స్‌పై ఉండగానే నేసన్ దర్శకత్వంలో పవన్ కళ్యాణ్ మరో సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. తమిళ చిత్రం వేదాలం రీమేక్‌గా తెరకెక్కనున్న ఈ మూవీని ఎ ఎం రత్నం నిర్మిస్తున్నారు. ఈ సినిమాకు సంబంధించి ఓ వార్త ఫిలింనగర్‌లో చక్కర్లు కొడుతోంది.తాజా ప్రాజెక్టులో పవన్‌కు జోడీగా నయనతార నటించనున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఇప్పటివరకు తెరపైన కనిపించని పవన్, నయన్‌ల కాంబినేషన్ సినిమాకు చాలా బాగా ఉపయోగపడుతుందని భావించిన చిత్ర యూనిట్ ఈ విషయమై నయనతారను సంప్రదించినట్లు టాలీవుడ్ వర్గాలు పేర్కొన్నాయి.ఈ మూవీ స్క్రిప్ట్‌ నచ్చిన నయనతార సినిమాలో నటించేందుకు గ్రీన్‌సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది. కథానుగుణంగా ఈ సినిమాలో ఇద్దరు హీరోయిన్లు అవసరముంటుందట. ప్రస్తుతానికి నయన్‌ను మెయిన్ హీరోయిన్‌గా సెలెక్ట్ చేసిన నిర్మాతలు మరో హీరోయిన్ కోసం వెతుకులాట ప్రారంభించారట. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com