ఇస్లామిక్ స్టేట్ ఆత్మాహుతి దాడిలో 55 మంది మృతి

- October 15, 2016 , by Maagulf
ఇస్లామిక్ స్టేట్ ఆత్మాహుతి దాడిలో 55 మంది మృతి

ఇస్లామిక్ స్టేట్ ఉగ్రసంస్థకు చెందిన ఓ సూసైడ్ బాంబర్ ఆత్మాహుతి దాడిలో 55 మంది మృతిచెందారు. ఈ ఘటన ఇరాక్ రాజధాని బాగ్దాద్ లో శనివారం మధ్యాహ్నం చోటుచేసుకుంది. ఇరాక్ పోలీసుల కథనం ప్రకారం.. నార్త్ బాగ్దాద్ ఏరియాలో మృతిచెందిన వ్యక్తి అంత్యక్రియల నిమిత్తం వందలాది మంది వచ్చారు. సరిగ్గా మధ్యాహ్నం సమయంలో ఆ ప్రాంతంలో ఉగ్రవాది ఆత్మాహుతి దాడికి పాల్పడ్డాడు. దీంతో మొత్తం 31 మంది మృత్యువాత పడగా, మరో 65 మందికి పైగా గాయాలపాలైనట్లు తెలిపారు.

గాయపడ్డవారిని దగ్గర్లోని ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నామని, అయితే బాధితులు ఈ ఘటనపై నోరు విప్పే పరిస్థితిలో లేరని అధికారులు చెప్పారు. గాయపడ్డవారిలో కొందరి పరిస్థితి తీవ్ర విషమంగా ఉందని వైద్యులు వెల్లడించారు.

నార్త్ బాగ్దాద్, మోసుల్ పట్టణంలో ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాదులపై ఇరాక్ భద్రతా బలగాలు దాడులు నిర్వహించేందుకు చర్యలు తీసుకుంటున్న నేపథ్యంలో ఈ ఆత్మాహుతి దాడి జరిగిందని ఓ సిబ్బంది స్థానిక మీడియాకు తెలిపారు. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com