ఆత్మాహుతి దాడిలో 46 మంది మృతి ...
- October 15, 2016
ఇరాక్ రాజధాని బాగ్దాద్ నగరంలో షియా ముస్లింలతో రద్దీగా వున్న ప్రాంతంలో శనివారం ఉదయం జరిగిన ఆత్మాహుతి దాడిలో 46 మంది మరణించారని, మరో 20 మందికి పైగా గాయపడ్డారని పోలీసులు చెప్పారు. 7వ శతాబ్దం నాటి మహ్మద్ ప్రవక్త మనుమడు హుస్సేన్ సంస్మరణ కార్యక్రమంలో పాల్గొనేందుకు వచ్చిన షియాలు ప్రార్థనలు చేస్తున్న సమయంలో పేలుడు పదార్థాలతో నింపిన కారులో దూసుకు వచ్చిన ఆత్మాహుతి దళ సభ్యుడొకరు ఈ దాడికి పాల్పడినట్లు అధికారులు చెప్పారు. ఇటీవల మరణించిన స్థానిక నేతకు సంతాపం తెలిపేందుకు కొందరు ప్రజలు అక్కడికి వచ్చినట్లు అధికారులు వివరించారు.
తాజా వార్తలు
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!
- వాణిజ్య స్థలాల అద్దెపై కువైట్ ఫైర్ ఫోర్స్ కీలక సూచనలు..!!







