భారత్- అమెరికా మిత్ర దేశాలంటున్న ట్రంప్
- October 16, 2016
భారతదేశానికి, హిందువులకు తాను వీరాభిమానినని అంటున్నారు అమెరికా రిపబ్లికన్ పార్టీ అధ్యక్ష అభ్యర్ధి డోనాల్డ్ ట్రంప్. అమెరికా న్యూజెర్సీలోని రిపబ్లికన్ హిందూ విభాగం నిర్వహించిన ఛారిటీ ఈవెంట్లో ట్రంప్ భారతదేశాన్ని ఉద్దేశిస్తూ ప్రసంగించారు. తానుగానీ అధ్యక్షుడిగా ఎన్నికైతే భారత్-అమెరికాలు మంచి స్నేహితులు అవుతాయి అన్నారు.
ఇరు దేశాల మధ్య మంచి స్నేహాభావమే కాకుండా మెరుగైన సత్సంబంధాలు ఉంటాయని ఇరు దేశాల మధ్య ఆర్ధిక సంస్కరణలపైశ్రద్ధ వహిస్తున్న భారత ప్రధాని నరేంద్ర మోదీని అభినందించారు.
అధ్యక్ష ఎన్నికల సమయంలో ఓ అధ్యక్ష అభ్యర్ధి ఇండియన్ అమెరికన్ ఈవెంట్కి హాజరుకావడం ఇదే తొలిసారని ప్రవాస భారతీయులు తెలిపారు.
తాను హిందువులకు, భారతదేశానికి పెద్ద అభిమానినని అధ్యక్షుడిగాఎన్నికైతే భారత, హిందూ కమ్యూనిటీకి వైట్హౌస్తో మెరుగైన సత్సంబంధాలు ఉంటాయని, మోదీపై చాలా విశ్వాసముందన్నారు. 19 నెలల క్రితం ఓసారి భారత్ వెళ్లానని మళ్లీ మళ్లీ రావాలని ఉందని తన ప్రసంగంలో ట్రంప్ పేర్కొన్నారు. ఉగ్రవాదాన్ని మట్టుబెట్టేందుకు భారత్ చేస్తున్న కృషి అభినందనీయమన్నారు.
తాజా వార్తలు
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!







