' అసమర్థ ' సాహిర్ కెమెరాలు రోడ్ల నియంత్రణకు సరిపోదు
- October 17, 2016
రియాద్ - ట్రాఫిక్ చట్టంలో సవరణల గూర్చి ఇటీవల మంత్రి మండలి ఆమోదంపై ప్రజల నుంచి మిశ్రమ స్పందనలు వెల్లువెత్తుతున్నాయి .కొంతమంది ఈ చట్టం గూర్చిమాట్లాడుతూ, కొత్త చట్టం చాలా కఠినమైనదని మరియు చాలా క్రూరమైన జరిమానాలు వంటి శిక్షలు కలిగినదని తమ అభిప్రాయం వ్యక్తం చేశారు.ఇతరులు కొందరు దీనిని సమర్ధించారు. నిర్లక్ష్యంగా వాహనాలు నడిపే డ్రైవర్లు, ముఖ్యంగా దేశదిమ్మరులకు ఇందులో తీవ్రమైన శిక్షలు అమలుజరగనున్నట్లు వ్యాఖ్యానిస్తున్నారు.
ట్రాఫిక్ వ్యవస్థపై నిపుణులైన ఒక న్యాయవాది మాట్లాడుతూ, ఈ సవరణల కారణంగా పౌరుడు మరియు అతని హక్కుల ప్రయోజనార్థం సంబంధించినవాని అన్నారు. అయితే వాహనదారుని వేగం నమోదు చేసే "అసమర్థ కెమెరాలను ట్రాఫిక్ పోలీసులు ఏర్పాటు చేసి అవి అత్యంత ఆధునికమైనవని వర్ణించడం విడ్డూరంగా ఉందని పేర్కొన్నారు. రోడ్డు పరిస్థితులను బట్టి వేగ పరిమితులు సర్దుబాటు కాబడతాయని నిర్లక్ష్యంగా వాహనాలు నడిపి నిబంధనలు ఉల్లంఘించినవారిపై కేసులు ఆధునిక నిఘా కెమెరాలతో మాత్రమే కేసులు నమోదు చేయాలనీ ఆయన పిలుపునిచ్చారు. చట్ట ఉల్లంఘనల గూర్చి న్యాయవాది విమర్శించారు. ప్రతి రకమైన ఉల్లంఘన కోసం ప్రత్యేక జరిమానాలు ఉన్నాయి..అయితే నేర తీవ్రత ఆధారంగా జరిమానాలు మాత్రమే రెట్టింపు చేసే సవరణలపై పునరాలోచించాలని ఆయన విమర్శించారు.
తాజా వార్తలు
- దుబాయ్లో 30 ఫుట్ ఓవర్ బ్రిడ్జీలపై స్మార్ట్ LED వ్యవస్థ..!! దుబాయ్: పాదచారుల భద్రతను మరింత మెరుగుపర�
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!







