కేసీఆర్ గవర్నర్ నరసింహన్‌తో భేటీ ...

- October 17, 2016 , by Maagulf
కేసీఆర్ గవర్నర్ నరసింహన్‌తో భేటీ ...

గవర్నర్ నరసింహన్‌తో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ సోమవారం భేటీ అయ్యారు. కొత్త జిల్లాల ఏర్పాటు తర్వాత పరిపాలనకు సంబంధించిన అంశాలను గవర్నర్‌కు వివరించారు. కొత్త సచివాలయం నిర్మించాలని భావిస్తున్న నేపథ్యంలో సచివాలయంలో ఏపీకి చెందిన భవనాలు ఖాళీ అయినందున తెలంగాణకు అప్పగించాలని గవర్నర్‌ను కోరినట్లు తెలిసింది.అనంతరం ఎంసీహెచ్ఆర్డీలో గ్రామీణ నీటి సరఫరా అధికారులతో సీఎంసమావేశమయ్యారు.మిషన్ భగీరథ పనులపై సమీక్ష నిర్వహించారు. ఇప్పటి వరకు జరిగిన పనుల వివరాలను తెలుసుకున్నారు. పనులను వేగవంతం చేసి 2017 చివరి నాటికి ఇంటింటికీ నీరు అందేలా చూడాలని అధికారులను సీఎం ఆదేశించారు

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com