కేసీఆర్ గవర్నర్ నరసింహన్తో భేటీ ...
- October 17, 2016
గవర్నర్ నరసింహన్తో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ సోమవారం భేటీ అయ్యారు. కొత్త జిల్లాల ఏర్పాటు తర్వాత పరిపాలనకు సంబంధించిన అంశాలను గవర్నర్కు వివరించారు. కొత్త సచివాలయం నిర్మించాలని భావిస్తున్న నేపథ్యంలో సచివాలయంలో ఏపీకి చెందిన భవనాలు ఖాళీ అయినందున తెలంగాణకు అప్పగించాలని గవర్నర్ను కోరినట్లు తెలిసింది.అనంతరం ఎంసీహెచ్ఆర్డీలో గ్రామీణ నీటి సరఫరా అధికారులతో సీఎంసమావేశమయ్యారు.మిషన్ భగీరథ పనులపై సమీక్ష నిర్వహించారు. ఇప్పటి వరకు జరిగిన పనుల వివరాలను తెలుసుకున్నారు. పనులను వేగవంతం చేసి 2017 చివరి నాటికి ఇంటింటికీ నీరు అందేలా చూడాలని అధికారులను సీఎం ఆదేశించారు
తాజా వార్తలు
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!







