పీరియాడి కల్‌ కథతో రానా..

- October 17, 2016 , by Maagulf
పీరియాడి కల్‌ కథతో రానా..

బాహుబలి తో బిజీగా ఉన్న రానా.ఈ సినిమా పూర్తయ్యాక తన కెరీర్‌ ఎలా ఉండాలో ప్లాన్‌ చేసుకుంటున్నాడు. పదే పదే బాహుబలి లాంటి సినిమాలు దక్కవని ఈ నటుడికి తెలుసు. ఆరేళ్లుగా ఒకే సినిమాలో ఉండిపోయిన రానా .త్వరగా ఈ సినిమా నుంచి బయటకు వచ్చి రెగ్యులర్‌ కమర్షియల్‌ సినిమాలు చేయాలని నిర్ణయించుకున్నాడు. వచ్చే ఏడాది ఏప్రిల్‌ 28న బాహుబలి రెండో భాగం ప్రేక్షకుల ముందుకు రానుండగా..చిత్రీ కరణ మాత్రం మరో రెండు నెలల్లో పూర్తవుతుంది.ఈలో పు దొరికిన సమయాన్ని తన కొత్త చిత్రాల ప్రీ ప్రొడక్షన్‌ పనులకు ఉపయోగిస్తున్నాడు రానా. ఒక్కో ప్రాజెక్టును ఒప్పుకుంటున్నాడు. ఇప్పటికే తేజ దర్శకత్వంలో ఓ సినిమాకు అంగీకారం తెలపగా. ప్రస్తుతం పీరియాడి కల్‌ కథతో మరో చిత్రానికి ఓకే చెప్పాడట.సమాచారం ప్రకారం ఇది స్వాతంత్య్రానికి పూర్వం జరిగే కథ. ఇందులో రానా ఓ సైనికుడిగా కనిపించనున్నారు. తమిళ, తెలుగు భాషల్లో సినిమా తెరకెక్కనుంది. రెజీనా నాయికగా నటించనుంది.మిగతా వివరాలను త్వరలో నిర్మాతలు వెల్లడించనున్నారు. ఇటీవల క్రిష్‌ దర్శకత్వంలో వరుణ్‌ తేజ్‌ నటించిన 'కంచె' ఇలాగే చారిత్రక నేపథ్యంతో తెరకెక్కింది. మళ్లి రానా అలాంటి ప్రయత్నం చేస్తున్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com