లింగమార్పిడి శస్త్రచికిత్సలను నిర్వహిస్తున్న 37 మంది ఆసియా ప్రవాసీయులు
- October 21, 2016
కువైట్ సిటీ : స్థానిక మఃబౌల ప్రాంతంలో ఒక నకిలీ దేశీయ కార్మిక కార్యాలయం నిర్వహిస్తూ, కువైట్ పౌరులు మోసగిస్తున్న 37 మంది ఆసియా దేశస్థుల సభ్యుల ముఠాను పోలీసులు అరెస్టు చేశారు. వారు అక్కడ కొనసాగిస్తున్నఅక్రమ కార్యకలాపాల గురించి సమాచారం అందుకొని రెసిడెన్సీ వ్యవహారాల జనరల్ డైరెక్టరేట్ కార్యాలయం నుంచి ఒక జట్టు వీరిపై పరిశోధనలు కోసం ఏర్పాటు చేయబడింది. వారిని పెట్టుకొనేందుకు ఒక ఉచ్చు ఏర్పాటు చేయబడింది. అనుమానితులను అరెస్టు చేసి అవసరమైన చట్టబద్ధమైన చర్యల కోసం సంబంధిత అధికారులు సూచించారు.ముగ్గురు ఆసియా దేశాలకు చెందిన ప్రవాసీయ వ్యక్తులు చట్టవిరుద్ధంగా కొందరకి లింగమార్పిడి శాస్త్రచికిత్స, ప్లాస్టిక్ సర్జరీలు అక్రమంగా చేస్తున్నందుకు వారిని అరెస్టు చేశారు. ఇంస్టాగ్రామ్ ద్వారా ప్రకటనల గురించి సమాచారాన్ని పొందిన తర్వాత వారి కదలికలపై సమగ్ర పరిశోధనలను జరిపి వారిని అరెస్ట్ చేశారు వారికి ఎటువంటి అర్హత కల్గిన వైద్య సర్టిఫికెట్లు లేకపోయినప్పటికీ వారు పలు శస్త్రచికిత్సలు ఎన్నో జరిపారు. ఈ తరహా లింగమార్పిడి శస్త్రచికిత్సలు ఎన్నో చేసినట్లు వారు తమ తప్పుని ఒప్పుకున్నారు. దీనితో అవసరమైన చర్యల కోసం సంబంధిత అధికారులు కేసులు నమోదు చేశారు.
తాజా వార్తలు
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!







