రాజుగారి చేపల కథ
- August 19, 2015
అనగనగా ఒక రాజు. ఆ రాజుగారు తన రాజ్యానికి తూర్పు వైపు ఉన్న ఒక కొలను దగ్గరకు వెళ్లి విశ్రాంతి సమయాన్ని ప్రశాంతంగా గడిపేవారు. ఆ కొలనులోని కలువలు రాజును పలకరిస్తున్నట్టుగా ఆయనను చూసి నవ్వుతున్నట్లుగా రాజు భావించేవాడు. అయితే ఆ కొలనుకు మరింత అందం తీసుకు రావాలని రాజుగారు ఆ కొలనులో అందమైన చేపలను పెంచాలని భావించి భటులకు ఆదేశించాడు. భటులు రంగు రంగుల చేపలను తీసుకుని వచ్చి రాణిగారి చేతికి ఇచ్చారు. రాణి ఆ చేపలను చూసి రకరకాల కూరలు వండమని వంటగత్తెలకు సూచించింది. రాజు ఆ రోజు వంటలను ఆస్వాదిస్తూ పుష్టిగా భోజనం చేశాడు. ఆ తరువాత భటులకు ఆదేశించిన చేపల సంగతి గుర్తుకు వచ్చి వారిని పిలిచి అడుగగా రాణిగారికిచ్చిన సంగతి తెలియజేశారు భటులు. రాణిని పిలిచి అడుగగా వంట సంగతిని చెప్పింది. అంతే కాకుండా మీరు నాకు ఆ సంగతిని చెప్పనే లేదు నాకు కూడా కొలనులో వేసే చేపల విషయాన్ని ప్రస్తావించి ఉండుంటే బాగుండేది అని ఆమె విస్తుపోయింది. దాంతో ఆయనే అసలు విషయాన్ని ప్రస్తావించకపోవడం వల్ల ఈ పొరపాటు జరిగిందనీ తరువాత భటులకు విషయాన్ని విపులంగా చెప్పి, మరిన్ని రంగురంగుల అందమైన చేపలను తెప్పించి కొలనులో వేయించాడు. అప్పట్నుంచీ ఆ కొలనులోని చేపలను చూస్తూ, రాజు, రాణులు ఇద్దరూ తమ విశ్రాంతి సమయాన్ని ఆనందంగా గడిపేవారు.
తాజా వార్తలు
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!
- వాణిజ్య స్థలాల అద్దెపై కువైట్ ఫైర్ ఫోర్స్ కీలక సూచనలు..!!







