రాజుగారి చేపల కథ
- August 19, 2015
అనగనగా ఒక రాజు. ఆ రాజుగారు తన రాజ్యానికి తూర్పు వైపు ఉన్న ఒక కొలను దగ్గరకు వెళ్లి విశ్రాంతి సమయాన్ని ప్రశాంతంగా గడిపేవారు. ఆ కొలనులోని కలువలు రాజును పలకరిస్తున్నట్టుగా ఆయనను చూసి నవ్వుతున్నట్లుగా రాజు భావించేవాడు. అయితే ఆ కొలనుకు మరింత అందం తీసుకు రావాలని రాజుగారు ఆ కొలనులో అందమైన చేపలను పెంచాలని భావించి భటులకు ఆదేశించాడు. భటులు రంగు రంగుల చేపలను తీసుకుని వచ్చి రాణిగారి చేతికి ఇచ్చారు. రాణి ఆ చేపలను చూసి రకరకాల కూరలు వండమని వంటగత్తెలకు సూచించింది. రాజు ఆ రోజు వంటలను ఆస్వాదిస్తూ పుష్టిగా భోజనం చేశాడు. ఆ తరువాత భటులకు ఆదేశించిన చేపల సంగతి గుర్తుకు వచ్చి వారిని పిలిచి అడుగగా రాణిగారికిచ్చిన సంగతి తెలియజేశారు భటులు. రాణిని పిలిచి అడుగగా వంట సంగతిని చెప్పింది. అంతే కాకుండా మీరు నాకు ఆ సంగతిని చెప్పనే లేదు నాకు కూడా కొలనులో వేసే చేపల విషయాన్ని ప్రస్తావించి ఉండుంటే బాగుండేది అని ఆమె విస్తుపోయింది. దాంతో ఆయనే అసలు విషయాన్ని ప్రస్తావించకపోవడం వల్ల ఈ పొరపాటు జరిగిందనీ తరువాత భటులకు విషయాన్ని విపులంగా చెప్పి, మరిన్ని రంగురంగుల అందమైన చేపలను తెప్పించి కొలనులో వేయించాడు. అప్పట్నుంచీ ఆ కొలనులోని చేపలను చూస్తూ, రాజు, రాణులు ఇద్దరూ తమ విశ్రాంతి సమయాన్ని ఆనందంగా గడిపేవారు.
తాజా వార్తలు
- IPL 2026: గుజరాత్ పై ముంబై ఘన విజయం
- నటుడు జగపతిబాబు చేతుల మీదగా రామ్ కొణికి సరికొత్త 'కొణికి లక్స్' స్కిన్ కేర్ ప్రారంభం
- మే 1 నుంచి తిరుమలలో శ్రీవారి దర్శనానికి కొత్త నిబంధనలు
- JEE మెయిన్స్ తుది ఫలితాలు వచ్చేశాయ్..
- ఏపీకి కేంద్ర ప్రభుత్వం గొప్ప శుభవార్త
- కాంగ్రెస్ ప్రభుత్వంకు కేసీఆర్ డెడ్లైన్
- కరీంనగర్లో ఘనంగా 'కార్తికేయ జువెలరీస్' ప్రారంభోత్సవం
- యూఏఈలో ఉగ్రవాద సంస్థ భగ్నం: దేశ భద్రతను దెబ్బతీయాలన్న కుట్ర విఫలం
- బహ్లా కోటలో నాలుగు కొత్త మ్యూజియమ్స్ ప్రారంభం..!!
- ఖతార్ మున్సిపాలిటీలో ఈకో ఫ్రెండ్లీ వెహికల్స్, పరికరాలు..!!









