ద్రాక్షరసంతో ముఖం మెరిపించండి
- August 19, 2015
ముఖం మీది మృతకణాలను తొలగించేందుకు, ముఖాన్ని తాజాగా ఉంచుకునేందుకు అనేక రకాల ఫేస్వాష్ క్రీములు అందుబాటులో ఉన్నాయి. అయితే ఈ క్రీములు అన్ని రకాల స్కిన్తత్వానికీ సరిపడవు. తద్వారా అనేక స్కిన్ ప్రోబ్లమ్స్ ఫేస్ చేయవలసి వస్తుంది. అందుకే ఇంట్లోనే రోజూవారి మనం ఉపయోగించే కూరగాయలు, పండ్లు ఉపయోగించి మన ముఖాన్ని మిలమిలా మెరిపించుకోవచ్చు. అలాంటి వాటిల్లో ముఖ్యంగా నల్ల ద్రాక్ష ఒకటి. నాలుగు నల్లద్రాక్ష పండ్లను మెత్తగా చేసి ఆ గుజ్జును ముఖానికి రాసి వలయాకారంలో రుద్దుతూ పాక్ వేసుకోవడం వల్ల ముఖం మీది ముడతలు పోయి తాజాగా మెరుస్తుంది. బొప్పాయి గుజ్జు కూడా ముఖానికి మంచి మేలు చేస్తుంది. పసుపు యాంటీ బయాటిక్గా పని చేస్తుంది. దీనికి కొద్దిగా నిమ్మరసం వేసి ముఖానికి పట్టిస్తే ముఖం మీది మృత కణాలు తొలగిపోయి తాజాగా ఉంటుంది. టొమాటోకి కొద్దిగా నిమ్మరసం చేర్చి ముఖానికి రాసి పావుగంట తర్వాత గోరువెచ్చని నీళ్లతో కడిగేసినా ముఖం మీది నల్లమచ్చలు తొలగి తాజాగా ఉంటుంది.
తాజా వార్తలు
- IPL 2026: గుజరాత్ పై ముంబై ఘన విజయం
- నటుడు జగపతిబాబు చేతుల మీదగా రామ్ కొణికి సరికొత్త 'కొణికి లక్స్' స్కిన్ కేర్ ప్రారంభం
- మే 1 నుంచి తిరుమలలో శ్రీవారి దర్శనానికి కొత్త నిబంధనలు
- JEE మెయిన్స్ తుది ఫలితాలు వచ్చేశాయ్..
- ఏపీకి కేంద్ర ప్రభుత్వం గొప్ప శుభవార్త
- కాంగ్రెస్ ప్రభుత్వంకు కేసీఆర్ డెడ్లైన్
- కరీంనగర్లో ఘనంగా 'కార్తికేయ జువెలరీస్' ప్రారంభోత్సవం
- యూఏఈలో ఉగ్రవాద సంస్థ భగ్నం: దేశ భద్రతను దెబ్బతీయాలన్న కుట్ర విఫలం
- బహ్లా కోటలో నాలుగు కొత్త మ్యూజియమ్స్ ప్రారంభం..!!
- ఖతార్ మున్సిపాలిటీలో ఈకో ఫ్రెండ్లీ వెహికల్స్, పరికరాలు..!!









