ద్రాక్షరసంతో ముఖం మెరిపించండి

- August 19, 2015 , by Maagulf
ద్రాక్షరసంతో ముఖం మెరిపించండి

ముఖం మీది మృతకణాలను తొలగించేందుకు, ముఖాన్ని తాజాగా ఉంచుకునేందుకు అనేక రకాల ఫేస్‌వాష్‌ క్రీములు అందుబాటులో ఉన్నాయి. అయితే ఈ క్రీములు అన్ని రకాల స్కిన్‌తత్వానికీ సరిపడవు. తద్వారా అనేక స్కిన్‌ ప్రోబ్లమ్స్‌ ఫేస్‌ చేయవలసి వస్తుంది. అందుకే ఇంట్లోనే రోజూవారి మనం ఉపయోగించే కూరగాయలు, పండ్లు ఉపయోగించి మన ముఖాన్ని మిలమిలా మెరిపించుకోవచ్చు. అలాంటి వాటిల్లో ముఖ్యంగా నల్ల ద్రాక్ష ఒకటి. నాలుగు నల్లద్రాక్ష పండ్లను మెత్తగా చేసి ఆ గుజ్జును ముఖానికి రాసి వలయాకారంలో రుద్దుతూ పాక్‌ వేసుకోవడం వల్ల ముఖం మీది ముడతలు పోయి తాజాగా మెరుస్తుంది. బొప్పాయి గుజ్జు కూడా ముఖానికి మంచి మేలు చేస్తుంది. పసుపు యాంటీ బయాటిక్‌గా పని చేస్తుంది. దీనికి కొద్దిగా నిమ్మరసం వేసి ముఖానికి పట్టిస్తే ముఖం మీది మృత కణాలు తొలగిపోయి తాజాగా ఉంటుంది. టొమాటోకి కొద్దిగా నిమ్మరసం చేర్చి ముఖానికి రాసి పావుగంట తర్వాత గోరువెచ్చని నీళ్లతో కడిగేసినా ముఖం మీది నల్లమచ్చలు తొలగి తాజాగా ఉంటుంది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com