స్వల్పంగా తగ్గిన పసిడి, వెండి ధరలు
- October 21, 2016
అంతర్జాతీయ మార్కెట్ల ప్రభావంతో గత మూడు రోజులుగా పెరుగుతూ పోయిన బంగారం ధర నేడు కాస్త దిగొచ్చింది. నగల వ్యాపారుల నుంచి ఆశించిన స్థాయిలో డిమాండ్ లేకపోవడంతో పుత్తడి తగ్గుముఖం పట్టింది. రూ. 140 తగ్గడంతో బులియన్ మార్కెట్లో 99.9 శాతం స్వచ్ఛత గల పది గ్రాముల పసిడి ధర రూ. 30,400గా ఉంది. ఇక వెండి కూడా నేడు బంగారం దారిలోనే పయనించింది. రూ. 400 తగ్గడంతో కేజీ వెండి ధర రూ. 42,300కు చేరింది. పారిశ్రామిక వర్గాలు, నాణేల తయారీదారుల నుంచి కొనుగోళ్లు లేకపోవడంతో ధరలు తగ్గినట్లు మార్కెట్ వర్గాలు పేర్కొన్నాయి. అంతర్జాతీయంగా కూడా బంగారం, వెండి ధరలు స్వల్పంగా తగ్గాయి.
తాజా వార్తలు
- అమరనాథ్ యాత్ర తేదీలు ఖరారు..
- తిరుమల శ్రీవారి జులై నెల సేవా టికెట్ల విడుదల
- ఈస్ట్-వెస్ట్ పైప్లైన్ ఫుల్ పంపింగ్ సామర్థ్యం పునరుద్ధరణ..!!
- ఉమ్ సలాల్ సెంట్రల్ మార్కెట్ లో మున్సిపల్ మినిస్టర్ తనిఖీలు..!!
- దుబాయ్-చైనా ఆర్థిక సంబంధాల విస్తరణపై చర్చలు..!!
- 24-గంటలపాటు ఫుడ్ హబ్ ప్రారంభం..!!
- 15 ఏళ్ల ప్రవాస బాలిక ఆచూకీ లభ్యం..!!
- భారీ వర్షాల నేపథ్యంలో సౌదీలో క్లాసులు రద్దు..!!
- గోల్డెన్ వీసా హోల్డర్లు విదేశాల నుంచి పని చేయవచ్చా?
- సౌదీ అరేబియాలో తెలుగు సమాఖ్య సేవా గాథ—నిరాశలో ఉన్న వ్యక్తికి కొత్త జీవితం









