ఐసిస్ ఉగ్రవాదులు ఇరాక్‌ లో మారణ హోమం సృష్టించారు

- October 23, 2016 , by Maagulf
ఐసిస్ ఉగ్రవాదులు ఇరాక్‌ లో మారణ హోమం సృష్టించారు

ఐసిస్ ఉగ్రవాదులు ఇరాక్‌ లో మారణ హోమం సృష్టించారు. తమ ప్రాంతాన్ని ఆక్రమించుకోడానికి  వస్తున్న ఇరాక్ సంకీర్ణ దళాల నుంచి తప్పించుకునేందుకు 284 మంది ప్రాణాలు తీశారు.  మోసూల్ ను స్వాధీనం చేసుకోడానికి వెళ్లినప్పుడు ఇది జరిగినట్టు ఇరాకీ దళాలు ప్రకటించాయి.  మోసూల్ దక్షిణ ప్రాంతాల నుంచి ఐసిస్ ను సైన్యం తరిమికొట్టినపుడు స్థానికులను ఉగ్రవాదులు మానవ కవచాలుగా ఉపయోగించుకున్నారు. చిన్న పిల్లల్ని, వృద్ధుల్ని రక్షణగా చేసుకుని 284  మంది మరణానికి కారణమయ్యారు. ఈ మృతదేహాలన్నిటినీ ఉత్తర మోసూల్ లోని ఒక కాలేజీ  మైదానంలో ఒకే గొయ్యి తీసి కప్పెట్టినట్టు ఇరాకీ దళాలు గుర్తించాయి.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com