వరుస పేలుళ్లు తో మణిపూర్....
- October 23, 2016
మణిపూర్ రాష్ట్రంలోని ఉక్రుల్ ప్రాంతంలో సోమవారం తెల్లవారుజామున వరుస పేలుళ్లు సంభవించాయి. ఈ ఘటనలో ఒకరికి తీవ్ర గాయాలయ్యాయి. మణిపూర్ ముఖ్యమంత్రి ఒక్రం ఇబోబీ సింగ్ పర్యటన నేపథ్యంలో ఈ పేలుడు చోటుచేసుకోవడం స్థానికంగా కలకలం సృష్టించింది.
గాయపడిన వ్యక్తిని ఆస్పత్రికి తరలించిన పోలీసులు.. ఘటన స్థలం వద్ద భారీగా మోహరించారు. సీఎం పర్యటన నేపథ్యంలో పటిష్ట భద్రత ఏర్పాటు చేశారు. కాగా, ఆదివారం కూడా ఇదే ప్రాంతంలో ఓ హ్యాండ్ గ్రనేడ్ గుర్తించిన పోలీసులు.. నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లి పేల్చేశారు.
పాక్ సైన్యం కాల్పుల్లో జవాను మృతి
శ్రీనగర్: దేశ సరిహద్దుల్లో పాక్ సైన్యం మరోసారి కాల్పులకు తెగబడింది.
జమ్మూకాశ్మీర్లోని ఆర్ఎస్ పురా, పర్గ్వాల్, కనాచక్ ప్రాంతాల్లోని సైనిక శిబిరాలపై పాక్ సైన్యం పలుమార్లు కాల్పులకు తెగబడింది. ఈ కాల్పుల్లో ఓ జవాను ప్రాణాలు కోల్పోగా, మరొకరు గాయపడ్డారు.
తాజా వార్తలు
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!







