వరుస పేలుళ్లు తో మణిపూర్....
- October 23, 2016
మణిపూర్ రాష్ట్రంలోని ఉక్రుల్ ప్రాంతంలో సోమవారం తెల్లవారుజామున వరుస పేలుళ్లు సంభవించాయి. ఈ ఘటనలో ఒకరికి తీవ్ర గాయాలయ్యాయి. మణిపూర్ ముఖ్యమంత్రి ఒక్రం ఇబోబీ సింగ్ పర్యటన నేపథ్యంలో ఈ పేలుడు చోటుచేసుకోవడం స్థానికంగా కలకలం సృష్టించింది.
గాయపడిన వ్యక్తిని ఆస్పత్రికి తరలించిన పోలీసులు.. ఘటన స్థలం వద్ద భారీగా మోహరించారు. సీఎం పర్యటన నేపథ్యంలో పటిష్ట భద్రత ఏర్పాటు చేశారు. కాగా, ఆదివారం కూడా ఇదే ప్రాంతంలో ఓ హ్యాండ్ గ్రనేడ్ గుర్తించిన పోలీసులు.. నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లి పేల్చేశారు.
పాక్ సైన్యం కాల్పుల్లో జవాను మృతి
శ్రీనగర్: దేశ సరిహద్దుల్లో పాక్ సైన్యం మరోసారి కాల్పులకు తెగబడింది.
జమ్మూకాశ్మీర్లోని ఆర్ఎస్ పురా, పర్గ్వాల్, కనాచక్ ప్రాంతాల్లోని సైనిక శిబిరాలపై పాక్ సైన్యం పలుమార్లు కాల్పులకు తెగబడింది. ఈ కాల్పుల్లో ఓ జవాను ప్రాణాలు కోల్పోగా, మరొకరు గాయపడ్డారు.
తాజా వార్తలు
- వాహనదారులకు ఊరట
- ఆస్కార్స్ 2026 ప్రజెంటర్గా ప్రియాంక చోప్రా
- పిల్లలు, కార్మికులకు భరోసా ఇవ్వండి: కువైట్ అంతర్గత మంత్రిత్వ శాఖ విజ్ఞప్తి
- ఆన్లైన్లో మిస్ లీడ్ కంటెంట్ స్ప్రెడ్.. 194 మంది అరెస్టు..!!
- ఖతార్లోని అల్-ఉదీద్ వైమానిక స్థావరంపై డ్రోన్ దాడి..!!
- మనామాలో హోటళ్ళు, నివాస భవనానికి నష్టం..!!
- కువైట్లో చిక్కుకున్న ప్రయాణీకులతో టచ్ లో ఎంబసీ..!!
- మిడిల్ ఈస్ట్, ఒమన్లో CBSE పరీక్షలు రద్దు..!!
- అరబ్ దేశాలపై ఇరాన్ దాడులను ఖండించిన కౌన్సిల్..!!
- యూఏఈలో పరిమితంగా కమర్షియల్ ఫ్లైట్స్ ప్రారంభం..!!









