శంషాబాద్‌ విమానాశ్రయంలో బంగారం స్మగ్లింగ్‌ కు అడ్డాగా మారింది!

- October 23, 2016 , by Maagulf
శంషాబాద్‌ విమానాశ్రయంలో బంగారం స్మగ్లింగ్‌ కు అడ్డాగా మారింది!

శంషాబాద్‌ విమానాశ్రయంలో బంగారం స్మగ్లింగ్‌ కు అడ్డాగా మారింది. అధికారులు ఎన్ని చర్యలు తీసుకున్నా ఫలితం ఉండడం లేదు. విదేశాల నుంచి ప్రయాణికులు ఏదో ఒక మార్గంలో బంగారాన్ని అక్రమంగా తరలిస్తూనే ఉన్నారు. బ్యాగ్‌లోనో లేదా షూ స్ లేదంటే తల వెంట్రుకల్లో గోల్డ్‌ను అక్రమంగా స్వదేశానికి చేరవేస్తునే ఉన్నారు. కస్టమ్స్ అధికారులు నిర్వహిస్తున్న తనిఖీల్లో అక్రమ బంగారం పట్టుబడడం సాధారణంగా మారింది. 
తాజాగా తమిళనాడుకు చెందిన ఓ ప్రయాణికుడు కిలోన్నర బంగారాన్ని అక్రమంగా తరలిస్తూ దొరికిపోయాడు. మస్కట్‌ నుంచి ఎయిర్‌ ఇండియా విమానంలో వచ్చిన ఆయన లగేజీ దాచిపెట్టాడు. అయితే అధికారులు తనిఖీలు నిర్వహించగా ఆయన గుట్టు రట్టయింది. నిందితున్ని అదుపులోకి తీసుకొని కిలోన్నర బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. దీని విలువ 40 లక్షలకు పైనే ఉంటుందని అధికారులు చెబుతున్నారు. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com