సెన్సార్ పూర్తి చేసుకున్న 'కారులో షికారు కెళితే'

- October 24, 2016 , by Maagulf
సెన్సార్ పూర్తి చేసుకున్న 'కారులో షికారు కెళితే'

శ్రీ హరీ హరిహర ఫిలిమ్స్ పతాకంపై మాదాల కోటేశ్వర్ రావు దర్శకత్వంలో మధు, అనీష్, అభిరాం సంయుక్తంగా నిర్మించిన చిత్రం 'కారులో షికారు కెళితే'. తాజాగా ఈ చిత్రం సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసుకుంది . యూత్ ఫుల్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కిన ఈ చిత్రానికి "ఏ " సర్టిఫికేట్ ఇచ్చారు. ఈ సందర్భంగా దర్శకుడు మాదాల కోటేశ్వర్ రావు మాట్లాడుతూ " సెప్టెంబర్ నెలలో జరిగిన కార్యక్రమం లో కారులో షికారుకెళితే టీజర్ తో పాటు ఫస్ట్ లుక్ రిలీజ్ చేసామని దానికి మంచి స్పందన వచ్చిందని అలాగే నవంబర్ మొదటి వారంలో ఆడియో వేడుక నిర్వహించి అదే నెలలో సినిమాని రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నామని. మా చిత్రం అన్ని వర్గాల ప్రేక్షకుల ఆదరణ చూరగొంటుందన్న ఆశాభావం వ్యక్తం చేసారు .

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com