విడుదలకు సిద్ధంగా ఉన్న 'ఇద్దరూ ఇద్దరే'

- October 24, 2016 , by Maagulf
విడుదలకు సిద్ధంగా ఉన్న 'ఇద్దరూ ఇద్దరే'

మోహన్‌లాల్‌, సత్యరాజ్‌ కథానాయకులుగా నటించిన మలయాళ చిత్రం 'లైలా ఓ లైలా'. అమలాపాల్‌ కథానాయిక. జోషి దర్శకత్వం వహించారు. ఈ చిత్రాన్ని తెలుగులో 'ఇద్దరూ ఇద్దరే' అనే పేరుతో విడుదల చేస్తున్నారు. ఈ సందర్భంగా నిర్మాత కందల కృష్ణారెడ్డి మాట్లాడుతూ.. 'ఇదో యాక్షన్‌ థ్రిల్లర్‌. ప్రతీ క్షణం ఉత్కంఠత కలిగిస్తుంది. అనువాద కార్యక్రమాలు పూర్తయ్యాయి. ఇటీవల విడుదల చేసిన ప్రచార చిత్రానికి మంచి స్పందన వచ్చింది' అని అన్నారు. వచ్చే నెలలో 'ఇద్దరూ ఇద్దరే' చిత్రం ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నట్లు ఆయన తెలిపారు.

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com