అలా చేస్తే బరువు తగ్గరు
- August 21, 2015
అధిక బరువుతో బాధపడేవాళ్లు ఇది తినకూడదేమో, అది తినకూడదేమో అని భయపడుతూ, కొన్ని మన శరీరానికి మేలు చేసే ఆహార పదార్ధాలను కూడా తినడం మానేస్తుంటారు. వాటిలో ముఖ్యమైంది పిండి పదార్ధాలు. వీటిని తీసుకుంటే లావైపోతామని భావించి వీటిని తినే విషయంలో చాలా అజాగ్రత్త చూపిస్తుంటారు. కానీ పిండి పదార్థాల్లో ఉండే అనేక రకాల ప్రొటీన్స్ ఖచ్చితంగా మన శరీరానికి అవసరమైనవి ఉంటాయి. ఇవి శరీరానికి అందకపోతే చాలా రకాల సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుంది. అయితే మనక్కావల్సిన పిండి పదార్దాలను ఎంచుకోవడమెలాగంటే.. గోధుమలు, బార్లీలాంటి వాటిలో గ్లూటెన్ అనే ప్రోటీన్ ఉంటుంది. ఇది కొందరికి పడకపోవచ్చు, అప్పుడు కడుపుబ్బరం, అజీర్తిలాంటి సమస్యలొస్తాయి. అందుకే ఇలాంటి పదార్ధాలను కొంచెం తక్కువగా తీసుకోవాలి. ఓట్స్లోని సాల్యుబుల్, అన్ సాల్యుబుల్ పీచు పదార్థాలు శరీరానికి ఎంతో మేలు చేస్తాయి. చెడు కొలెస్ట్రాల్ని కరిగించి, మంచి కొలెస్ట్రాల్ని పెంచుతాయి. చిరుధాన్యాలూ, గింజధాన్యాలూ, మొలకెత్తిన గింజలు మొదలగు పిండిపదార్ధాలను తీసుకోవడం వల్ల బరువు తగ్గడానికి ఉపయోగపడడమే కాకుండా, శరీర తక్షణ శక్తికి కావల్సిన ప్రోటీన్స్ని తగు మోతాదులో అందించడానికి తోడ్పడతాయి.
తాజా వార్తలు
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!
- వాణిజ్య స్థలాల అద్దెపై కువైట్ ఫైర్ ఫోర్స్ కీలక సూచనలు..!!







