రంగయ్య తెలివి
- August 21, 2015
ఒక ఊరిలో రంగయ్య అనే రైతు ఉండేవాడు. పక్కనే సాంబయ్య అనే మరో రైతు ఉండేవాడు. అతని ఇంట్లో చాలా కోళ్లు ఉండేవి. అవన్నీ రంగయ్య పెరట్లోకి వచ్చి రంగయ్య భార్య ఎండబెట్టిన తిండి గింజలు, వాళ్లు పెంచుకున్న మొక్కలూ తిన్నంత తిని మిగతావి వాటి కిష్టమొచ్చినట్లు తొక్కేసి వెళ్లేవి. చాలా సార్లు ఈ విషయం రంగయ్య, సాంబయ్యకి చెప్పినా ఆవేమైనా మనుషులా? మనం చెప్పినట్లు వినడానికి. కోళ్లు కదా మనం చెప్పినా వినవు రంగయ్యా..అని నవ్వేసి నిర్లక్ష్యంగా వెళ్లి పోయేవాడు. ఈ చర్యకు పాపం రంగయ్య చాలా విస్తుపోయేవాడు. ఒకరోజు సాంబయ్య పనిమీద పొరుగూరికి వెళ్లాడు. వచ్చి చూసేసరికి రంగయ్య పెరట్లో గుడ్లను ఏరుకుంటూ కనిపించాడు. అది చూసిన సాంబయ్య ఏంటి రంగయ్యా నీకు కోళ్లు లేవు కదా! ఈ గుడ్లు ఎక్కడివి? అని అడిగాడు. అందుకు రంగయ్య ఇందాకే నీ కోళ్లు వచ్చి మేసి వెళ్ళాయి. బహుశా అవి పెట్టిన గుడ్లే అయ్యుంటాయి అని చెప్పి లోపలికి వెళ్లిపోయాడు. అంతే సాంబయ్య తన కోళ్లు రోజూ రంగయ్య ఇంట్లో గుడ్లు పెట్టేస్తున్నట్లున్నాయి అనుకుని అప్పట్నుంచీ తన కోళ్లను రంగయ్య పెరట్లోకి పోనియ్యకుండా తన పెరట్లోనే మేపుకునేవాడు. నిజానికి ఇదంతా రంగయ్య పన్నిన ఉపాయం. కానీ ఇది నిజం అనుకుని సాంబయ్య భలే నమ్మేశాడు. అంతేమరి మంచిగా మాటలతో చెబితే వినలేదు. గొడవ పెట్టుకుంటే పొరుగింటివాడు బాగోదు. అందుకే సున్నితంగా రంగయ్య భలే ఉపాయం పన్నాడు. తను అనుకున్నది సాధించాడు.
తాజా వార్తలు
- IPL 2026: గుజరాత్ పై ముంబై ఘన విజయం
- నటుడు జగపతిబాబు చేతుల మీదగా రామ్ కొణికి సరికొత్త 'కొణికి లక్స్' స్కిన్ కేర్ ప్రారంభం
- మే 1 నుంచి తిరుమలలో శ్రీవారి దర్శనానికి కొత్త నిబంధనలు
- JEE మెయిన్స్ తుది ఫలితాలు వచ్చేశాయ్..
- ఏపీకి కేంద్ర ప్రభుత్వం గొప్ప శుభవార్త
- కాంగ్రెస్ ప్రభుత్వంకు కేసీఆర్ డెడ్లైన్
- కరీంనగర్లో ఘనంగా 'కార్తికేయ జువెలరీస్' ప్రారంభోత్సవం
- యూఏఈలో ఉగ్రవాద సంస్థ భగ్నం: దేశ భద్రతను దెబ్బతీయాలన్న కుట్ర విఫలం
- బహ్లా కోటలో నాలుగు కొత్త మ్యూజియమ్స్ ప్రారంభం..!!
- ఖతార్ మున్సిపాలిటీలో ఈకో ఫ్రెండ్లీ వెహికల్స్, పరికరాలు..!!









