యూఏఈలో ఇన్ఫ్లుయెంజా వైరస్ కలకలం
- October 24, 2016
సమ్మర్ నుంచి వింటర్ దిశగా వాతావరణ పరిస్థితులు మారుతుండడంతో యూఏఈలో ఇన్ఫ్లుయెంజా వైరస్ చాలా యాక్టివ్గా మారుతున్నట్లు డాక్టర్లు హెచ్చరించారు. వాక్సినేషన్ ద్వారా ఈ వైరస్ బారిన పడకుండా ఉండొచ్చని వారు సూచించడం జరుగుతోంది. ఇటీవలి కాలంలో నమోదవుతున్న ఎమర్జన్సీ కేసుల్లో 15 శాతం కేవలం ఫ్లూ కారణంగానేనని డాక్టర్ హస్సన్ కాజియా పేర్కొన్నారు. ఎక్కువ తీవ్రతతో కూడిన జ్వరం, చలి, దగ్గు, జలుబు, ఒంటి నొప్పులు, నీరసం వంటి సమస్యలు తలెత్తగానే వెంటనే ఆలస్యం చేయకుండా డాక్టర్లను సంప్రదించాల్సి ఉంటుందని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. సాధారణంగా వచ్చే జ్వరం, జలుబుకి భిన్నంగా వైరస్ కారణంగా వచ్చే సమస్యలుంటాయనీ, వీటి విషయంలో ఏమాత్రం అజాగ్రత్త తగదని డాక్టర్లు హెచ్చరించడం జరుగుతోంది. పరిశుభ్రతను పాటించడం, పబ్లిక్ ప్లేస్లకు వెళ్ళేటప్పుడు తగిన జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా ఇన్ఫ్లుయెంజా నుంచి తప్పించుకోడానికి ఆస్కారం ఉంది. దగ్గేటప్పుడు తుమ్మేటప్పుడు నోటికి, అలాగే ముక్కుకి అడ్డంగా కర్చీఫ్ లేదా మాస్క్ ఉంచుకోవడం వల్ల ఇన్ఫ్లుయెంజా వ్యాప్తిని కొంతమేర తగ్గించవచ్చు. ఇమ్యూన్ సిస్టమ్ బలంగా ఉండేందుకు సి-విటమిన్ ఉండే పదార్థాల్ని తీసుకోవాల్సి ఉంటుంది. ఆవిరిని పట్టడం ద్వారా చిన్న చిన్న సమస్యలను దూరం చేసుకోవచ్చు.
తాజా వార్తలు
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!







