దీపావళికి లగ్జరీ కార్ల అమ్మకాలు...
- October 25, 2016
దీపావళికి లగ్జరీ కార్ల అమ్మకాలు వావ్ అనేలా ఉండబోతున్నాయి. గత ఏడాదికన్నా ఈ సారి ఈ ఫెస్టివల్ కి మెర్సిడెస్ బెంజ్, స్కోడా వంటి ఖరీదైన కార్లకు డిమాండ్ బాగా పెరిగిందని హైదరాబాద్ లోని షో రూమ్ నిర్వాహకులు చెబుతున్నారు. వీటి అమ్మకాలు ఈ సారి 30 శాతం పెరిగాయట. ముఖ్యంగా 22 ఏళ్ళ నుంచి 30-35 ఏళ్ళ టెక్కీలు వీటిని సొంతం చేసుకోవడానికి ఉవ్విళ్ళూరుతున్నారని తెలిసింది.50 లక్షల నుంచి 70 లక్షల వరకు పెట్టి అయినా సరే లగ్జరీ కార్లను కొందామని అనుకుంటున్నవారు కొందరైతే, కోటి రూపాయలైనా వెనుకాడబోమని మరికొంతమంది ముందుకు రావడం షో రూమ్ నిర్వాహకులను ఆశ్చర్యపరుస్తోంది. గత సంవత్సరం దీపావళి సీజన్ లో సుమారు 50 కార్లను తాము అమ్మామని, అయితే ఈ సారి బుకింగ్ లు 30 శాతం పెరిగాయని అంటున్నారు.దీపావళికి ముందు వచ్చే ధంతేరాస్ నాటికే తాము కొత్త కార్ల సొంతదారులం కావాలని చాలామంది తహతహలాడుతున్నారు.ఇక చాలా షో రూమ్ లు ఇస్తున్న ఆఫర్లు, స్కీమ్ లు కూడా వీరిని చాలా ఆకర్షిస్తున్నాయి. ఏడాదికి ఈ ఎం ఐ రేట్లు తక్కువగా ఉన్నాయని భావిస్తున్న పలువురు ఉత్సాహంగా ఈ కార్ల కొనుగోలుకోసం షో రూమ్ ల వద్ద బారులు తీరుతున్నారు.
తాజా వార్తలు
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!







