బిషారో అతిథి గృహంపై గుర్తుతెలియని వ్యక్తులు బాంబు దాడి..
- October 25, 2016
కెన్యాలోని ఓ అతిథి గృహంలో మంగళవారం ఉదయం బాంబు దాడి జరిగింది. ఈ ఘటనలో 12 మంది పౌరులు మృతిచెందారు. స్థానిక పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..మండేరా ప్రాంతంలోని బిషారో అతిథి గృహంపై గుర్తుతెలియని వ్యక్తులు బాంబు దాడి చేశారు. ఈ ఘటనలో 12 మంది అక్కడికక్కడే మృతిచెందగా.. భవనం పూర్తిగా ధ్వంసమైంది. శిథిలాల కింద మరికొందరు చిక్కుకుని ఉన్నారని పోలీసులు తెలిపారు. భద్రతా సిబ్బంది ఘటనాస్థలానికి చేరుకుని సహాయకచర్యలు చేపట్టారు. శిథిలాల కింద చిక్కుకుపోయిన వారిని కాపాడేందుకు యత్నిస్తున్నారు. అల్-షబాబ్ ఉగ్రవాదులు ఈ దాడికి పాల్పడి ఉంటారని పోలీసులు అనుమానిస్తున్నారు.ఘటన అనంతరం ఉగ్రవాదులు సోమాలియా సరిహద్దు వైపునకు పారిపోయినట్లు తెలిపారు.
తాజా వార్తలు
- దుబాయ్లో 30 ఫుట్ ఓవర్ బ్రిడ్జీలపై స్మార్ట్ LED వ్యవస్థ..!!
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!







