బిషారో అతిథి గృహంపై గుర్తుతెలియని వ్యక్తులు బాంబు దాడి..

- October 25, 2016 , by Maagulf
బిషారో అతిథి గృహంపై గుర్తుతెలియని వ్యక్తులు బాంబు దాడి..

కెన్యాలోని ఓ అతిథి గృహంలో మంగళవారం ఉదయం బాంబు దాడి జరిగింది. ఈ ఘటనలో 12 మంది పౌరులు మృతిచెందారు. స్థానిక పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..మండేరా ప్రాంతంలోని బిషారో అతిథి గృహంపై గుర్తుతెలియని వ్యక్తులు బాంబు దాడి చేశారు. ఈ ఘటనలో 12 మంది అక్కడికక్కడే మృతిచెందగా.. భవనం పూర్తిగా ధ్వంసమైంది. శిథిలాల కింద మరికొందరు చిక్కుకుని ఉన్నారని పోలీసులు తెలిపారు. భద్రతా సిబ్బంది ఘటనాస్థలానికి చేరుకుని సహాయకచర్యలు చేపట్టారు. శిథిలాల కింద చిక్కుకుపోయిన వారిని కాపాడేందుకు యత్నిస్తున్నారు. అల్‌-షబాబ్‌ ఉగ్రవాదులు ఈ దాడికి పాల్పడి ఉంటారని పోలీసులు అనుమానిస్తున్నారు.ఘటన అనంతరం ఉగ్రవాదులు సోమాలియా సరిహద్దు వైపునకు పారిపోయినట్లు తెలిపారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com