ఆఫ్గనిస్థాన్‌లో తాలిబన్ల దాడి 8మంది మృతి

- October 25, 2016 , by Maagulf
ఆఫ్గనిస్థాన్‌లో తాలిబన్ల దాడి 8మంది మృతి

పోలీస్‌ చెక్‌పోస్ట్‌పై తాలిబన్‌ ఉగ్రవాదులు దాడి చేయడంతో 8మంది సరిహద్దు భద్రతా సిబ్బంది ప్రాణాలను కోల్పోయారు. గతరాత్రి ఆఫ్గనిస్థాన్‌లో ఈ దుర్ఘటన చోటు చేసుకుంది. అధికారుల కథనం ప్రకారం..
ఆఫ్గనిస్థాన్‌లోని టోర్ఖమ్‌లో గల ఖైబర్‌ పోలీస్‌ చెక్‌పోస్ట్‌పై గత రాత్రి తాలిబన్‌ ఉగ్రవాదులు దాడికి దిగారు. కొన్ని గంటలపాటు చెక్‌పోస్ట్‌ను తాలిబన్లు తమ అధీనంలోకి తీసుకున్నారు. అక్కడ ఉన్న పరికరాలనన్నిటినీ దోచుకుని, 8మంది భద్రతా సిబ్బందిని చంపి అక్కడ నుంచి పరారయ్యారు.

కాగా.. దీనిపై భద్రతాధికారులు ఇప్పటివరకూ ఎలాంటి వివరణ ఇవ్వలేదని అధికారులు తెలిపారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com