బహ్రెయిన్ హజ్ యాత్రీకులు నిబంధనలు పాటించాలి
- August 22, 2015
బహ్రెయిన్ నుండి మక్కా కు హజ్ యాత్ర నిమిత్తమై వచ్చే నెల వెళ్లనున్న సుమారు 3500 మంది యాత్రీకులు, పెరిగిన భద్రతా నియమావళి ప్రకారం నడుచుకోవాలని, రాజకీయ సంబంధమైన సాహిత్యాన్ని కలిగిఉండడo లేదా మతవిధానాలను రాజకీయ ప్రయోజనాలకు ఉపయోగించడం వంటి చర్యలు శిక్షార్హమైనవని, ఆంతరంగిక శాఖ పోర్టు సెక్యూరిటీ డైరక్టర్ జనరల్- కల్నల్ మహెర్ అహ్మద్ బువాలీ హెచ్చరించారు. ఇంకా బస్సు డ్రైవర్లు యాత్రీకుల భద్రత కోసం, ట్రాఫిక్ నియమాలను పాటించాలని, అసిస్టెంట్ డ్రైవర్లను కలిగిఉండాలని హెచ్చరించారు. హజ్ మెడికల్ మిషన్ కో-ఆర్దీనేషన్ ఛైర్మన్ డా. అలీ అల్ బక్కారా మాట్లాడుతూ, ఇక్కడ ఉన్న 51 రిజిష్టర్డ్ మక్కా కరవాన్లు ఐనా నియమనింబంధనలు పాటించి వెక్సినేషన్లు చేయించుకోవాలని, యజమానులు మేనేజర్లకు విజ్ఞప్తి చేశారు. అధికారులకు చెప్పాపేట్టకుండా యాత్రకు వెళ్ళిపోయే భక్తులు తమకు పెద్ద సవాలని కూడా ఆయన తెలియజేశారు.
--యం.వాసుదేవ రావు(మాగల్ఫ్ ప్రతినిధి,బహ్రెయిన్)
తాజా వార్తలు
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!







